పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సహస్రలింగాల శాసనాల్తో, తెలుగు భాష చరిత్రకుపకరించే రెండు శాసనాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

విజయనగర సామాట్టు శ్రీరాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీకృష్ణదేవమహారాయల ప్రసక్తిగల క్రీ.శ 1517, జూన్‌ 19 వతేదీనాటి శాసనం ఆలయ మండపందగ్గర ఉంది. 97 పంక్తులున్న ఈ తెలుగు శాసనంలో,శ్రీకృష్ణదేవరాయని రాజ్యంపై శ్రీసాళ్వతిమ్మరు సయ్యంగారు, శ్రీకపోతేశ్వరానికి చెందిన (చేజర్ల) శ్రీకరణ నమశ్రవారుల / నమశ్శివాయ గారు శ్రీకపోతేశ్వరస్వామికి ఇంకా ఇతర శివాలయాలకు ఇచ్చిన వివరాలు ఉన్నాయి.

తెలుగుశాసనమున్న దేవాలయాన్ని చూడబోతున్నామని చెబుతూ విజయవాడలో బయలుదేరి విష్పర్లకు చేరిన నాకు నిర్తక్ష్యంగా పడిఉన్న శాసనాలు నిరాశను మిగిల్చాయి. ఉన్నపళంగా మత మార్పిడికి గురైన చేజర్ల బౌద్ద ఆరామంలోని స్తంభాలు, శివాలయ మండప భారాన్ని మోస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాయి.

ఒకప్పుడు బౌద్దధర్మ నిలయాలైన చైత్య, విహార శిధిలాలు -మరో అశోకుని కోసం ఎదురుచూస్తున్నాయి. త్యాగనిరతికి, బౌద్ద ధార్మిక జెన్నత్యానికి ప్రతీక అయిన శిబిజాతకం మరో-మత ఘాతుకానికి బలైంది బౌద్దభిక్షువుల వర్షావాసాలుగా, ధ్యానం చేసి సమాధి స్థితిలో(2) నిర్వాణానందాన్ని చవిచూపించిన గుహలు, కల్పిత మేఘాల మల్లయ్య నివాసాలుగా మారిపోయాయి. ఏదిఏమైతేనేం, విప్పర్లలో తొంగి చూచిన తెలుగు, అటు తరువాత వెలుగును కోల్పోయింది. వెయ్యేళ్లపాటు వెలుగొందిన బౌద్దం నిషిద్దగీతమైందని, ఒక కొత్తమతం ప్రజల అఖిమతాన్ని కాదని, మౌడ్యాన్ని నూరిపోసింది. శాంతిని కాంక్షించిన బౌద్దం, రెక్కలు తెగిన పావురమైంది. గతాన్ని తలచుకుంటూ అనాగత్వాన్ని ఆహ్వానిస్తూ తిరుగు ప్రయాణం ముగించుకొని ఇంటికి చేరుకున్నాను. విప్పర్ల శాసనం, చేజర్ల చైత్యాలయం నన్ను ముసురుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. చరిత్రకు, చారిత్రక ఆనవాళ్లకు మళ్లీ మంచిరోజులు రాకపోతాయా అనుకునేలోపు కంటికి కునుకు పట్టింది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

37