పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళ్లకు కావల్సిన సేవలు చేయడానికి మిగినవాళ్లంతా పోటీపడేవాళ్లు.

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకూ, వైద్య సదుపాయాలందించే వైద్యులకూ, విద్యాలయాల్లో పనిచేసే వుపాధ్యాయులకూ, వివిధశాఖల్లో పనిచేసే వుద్యోగులకూ, తృప్తినిచ్చేటంత జీతభత్యాలుండితీరాలని ప్రభుత్వాలు పట్టుబట్టేవి.

అప్పుడాదేశంలో ప్రముఖంగావున్న మూడు నాలుగు మతాలవాళ్లూ, మతమంటే జీవన విధానం మాత్రమేననీ, అన్ని మతాల సారమూ మానవత్వమేననీ గుర్తించి, పరస్పరం గౌరవించుకునే వాళ్లు. అందరి మధ్యా స్నేహాలు పెరగడంతో, వివిధ కులాలవాళ్లూ, దగ్గరై, వివాహాలు చేసుకొని, క్రమంగా అన్ని మతాల సారమైన మానవత్వపు మతాన్నొకదాన్ని రూపొందించుకున్నారు.

మనిషి జీవితాన్ని రసవంతంగా మాచ్చే లలితకళలంటే అందరికీ గొప్ప ప్రేమా, గౌరవమూ వుండేవి. కళాకారులందరూ సౌకర్యవంతంగా జీవించేలా ప్రణాళికలు తయారుచేసుకునేవాళ్లు. యేదోవొక 'ప్రాచుర్యమున్న కళను ఆసరా చేసుకుని అర్హతకుమించిన సంపదలను కొల్లగొట్టాలనుకునే కళాకారులు లేకపోవడంతో అన్ని కళలకూ సమాన గౌరవముండేది. విద్యలోనూ, కళల్లోనూ వుండే స్పర్ణ ఆరోగ్యవంతంగానే వుండేది. ఆటల్లో గూడా 'ప్రాచుర్యమున్న ఆటల్ని ఆదే ఆటగాళ్లు, యితర ఆటలు ఆడే ఆటగాళ్లతో సమానంగా మాత్రమే కీర్తి ఆర్జనలుండాలని కోరుకునేవాళ్లు. ప్రజలూ ప్రభుత్వమూ దానికనుగుణంగానే ప్రవర్తించేవి.

మెట్ట ప్రాంతాలూ, నదీనదాలూ, యెడారులూ, కొండలూ, మైదానాలూ, అడవులూ, యిలా అనేక రకాలుగావుండే ఆదేశపు నైసర్గిక ప్రదేశాల్లోనివాళ్లు ఆయా ప్రాంతాల్లోవుండే పరిమితుల్లోనే జీవిస్తూ, తమకు కావల్సిన అదనపు సౌకర్యాల్ని మిగిలిన ప్రాంతాలనుంచీ అవసరమైనంతగా ఫొందగలిగేవాళ్లు. ఆయా భౌగోళిక పరిస్థిలులకనుగుణంగా రూపొందిన వాళ్లు చాలా మంది ఆయా ప్రాంతాల్లోనే వుండగలిగేవాళ్లు. భిన్నరుచుల్తో, వేరేచోటికి వెళ్లాలనుకునేవాళ్లకు సులభంగా అది చేకూరుతూవుండేది.

ఆ ద్వీపకల్పానికి సాహిత్య, సాంస్కృతిక, వారసత్వంలాగే, దానికున్న సహజవనరులూ, భౌతిక సంపదా అంతులేనిది. అది అందరిదీ అన్న ప్రగాఢ విశ్వాసముండడంతో, ఆదేశంలో కరువులు లేవు. వరదలు, తుఫానులు, అంటువ్యాధులు, భూకంపాలవంటి ప్రకృతి వైపరీత్యాల్ని ముందుగా తెలుసుకునే విజ్ఞానం అందుబాటులో వుండేది. తామంతా ప్రకృతి సంతానమని గుర్తించిన ఆ దేశపు ప్రజలు, ప్రకృతి నియమాలకనుగుణంగా తమ జీవితాల్ని రూపొందించుకునేవాళ్లు.

యెన్ని జాగత్తలు తీసుకున్నా మానవ పరిమితులవల్ల అనుకోని ప్రమాదాలు అవాంతరాలూ యెదురైనప్పుడు దేశ ప్రజలంతా కలిసికట్టుగా యెదుర్మొనేవాళ్లు. మానవజీవన పరిమితులవల్ల జరిగే యిక్కట్లకు తట్టుకుంటూ, సానుభూతితో ప్రేమతో జీవించడం వాళ్ల సహజ జీవన విధానమైపోయింది.

ఆ దేశాన్నీ ఆదేశ ప్రజలనూ చూసిన యితర దేశాలూ, ప్రజలూ క్రమంగా తామూ అలాగే పురోభివృద్ధిని సాధించితీరాలని కష్టపడి పనిచేయసాగారు.

          *      *      *

యీ కథలో నిజమెంతో కల్పన యెంతో విజ్ఞులైన మీకు


చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఇంత కథా పుట్టడానికి వెనక కొన్ని ప్రశ్నలు మాత్రం నిలువెత్తు నిజాల్లా నిలబడివున్నాయి. :-

వ్యవసాయదారులకోసమనే చట్టాలు చేస్తున్నామని అంటూ ప్రభుత్వమొకవైపూ, తమను కాపాడండి మహాప్రఖో అంటూ రైతులు మరోవైపూ ఆక్రోశిస్తున్నారెందుకు?

కాశ్మీరులో పాక్‌ ఆక్రమిత కాళ్ళీరు, ఆజాద్‌ కాళ్ళీరు చైనా ఆక్రమిత కాశ్మీరు, యిలా యిన్ని విఖేదాలెందుకు?

యే రాష్ట్రంలోనయినా అరాచకం పెరిగితే “యిది బీహార్‌ అనుకుంటున్నావా?” అనీ అనడం రివాజెందుకయ్యింది?

కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలెందుకయ్యాయి? కొన్ని రాష్ట్రాలవాళ్లకు ప్రత్వేక పన్నులు, సదుపాయాలూ యెందుకున్నాయి?

విద్య, వైద్యంవంటి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాధికారమెవరిది? కేంద్రం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రాలు పాటించకపోయినా తప్పులేదా?

కేంద్రం కొన్ని రాష్ట్రాలను స్వంతమైనవిగానూ, కొన్నింటిపైన సవతి తల్లి ప్రేమనూ చూపిస్తున్నవనడంలో నిజమెంత?

మతాతీత, కులాతీత లౌకిక రాజ్యమని పేర్కొనబడిన రాజ్యాంగపు సిద్ధాంతానికి కట్టుబడే వున్నామా? మున్సీపల్‌ కౌన్సీలర్‌ నుంచీ దేశాధినేత యొన్నిక వరకూ కులమూ, మతమూ యెందుకు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి?

కొందరు తమనెందుకు మైనారిటీలమని ఘోపిస్తున్నారు?

కొన్ని కులాలవాళ్లు తమను బీసీలుగా, యెస్సీలుగా గుర్తించమని యెందుకు ప్రాధేయపడుతున్నారు?

కులాలకూ మతాలకూ ప్రత్యేక బోర్టులూ, ఛెర్మనులూ యివ్వడం రాజ్యాంగబద్దమేనా?

మూడు రాజధానులని వొకరూ, వొకే రాజధాని అని మరొకరూ యెందుకిలా పట్టుబడుతున్నారు?

స్వతంత్ర ప్రతిపత్తి వుందనుకునే న్యాయవ్యవస్థలో యిన్ని లుకలుకలెందుకు? యీ బదిలీలెందుకు?

చాలా పెద్దదని 'పేరుమోన్తున్న భారత రాజ్యాంగానికిన్ని సవరణలెందుకు?

మాతృభాషలో విద్య అనే అంశంపైన కేంద్రమూ, రాష్ట్రమూ వేర్వేరు నిర్ణయాలు తీసుకోవచ్చా?

హోసూరులో, బళ్లారిలో, తెలుగువాళ్లు మాతృభాషకోసమని అంత పోరాటం చేయాల్సిన అవసరమేమిటి?

యిటీవల వాడిస్సా రాష్ట్రం, కొన్ని తీరప్రాంతపు ఆంధ్రప్రదేశ్‌ గ్రామాల్ని ఆక్రమించుకుంటోందని పత్రికలెందుకు ఫిర్యాదు చేస్తున్నాయి?

మనమంతా భారతీయులమనే మౌలికమైన భావనను యెందుకు మరచిపోతున్నారు?

రాజకీయాలే వృత్తిగా యెందుకు మారిపోయాయి?

కొందరు కాసింత శ్రమకూడా చేయకుండా కోట్లకుకోట్లు గడిస్తోంటే, చాలామంది కనీసావసరాలు కూడా లేకుండా యెందుకున్నారు?

యీ ప్రశ్నల జాబితా చాలా పెద్దది.

సమాధానాలే కరువు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

38