లీడెన్ నియమితుడయ్యాడు.
జావా జయించిన అనంతరం ఉద్యోగ నిర్వహణతోపాటు సాహిత్య పరిశోధనలు, గ్రంథ సేకరణ, స్థానిక జెషధాలకు పనికివచ్చే మొక్కలు సేకరించాడు. ఒకరోజు బటేవియా నగరంలో ప్రాచ్చదేశపు గ్రంథాలున్నాయని, అవి చాల ప్రాచీనమైనవని లీడెన్ విన్నాడు. అంతే వాటిని పరిశీలించడానికి ఎకాయకిని వెళ్ళాడు. ప్రాచీనమైన ఒక భవనంలో ఈ గ్రంథసంపద ఉందని గుర్తించాడు. ఆ గదినిండా డచ్ వారి సామాగ్రి, ఆ ద్వీపంలోని అపురూప వస్తు సంపద ఉందని గుర్తించాడు. కొన్నేళ్ళుగా మూతపడిన ఆ గది మూసి ఉన్నందువల్ల, గాలి, వెలుతురు చొరపడే అవకాశం లేనందువల్ల మగ్గిపోయింది. గది తలుపు ఒక్కటే ఉంది. కిటికీలు లేవు. తెరచీతెరవంగానే ఉత్సాహంగా లోనికి ప్రవేశించిన లీడెన్, లోపల ఏర్పడిన విషవాయువులు పీల్చాడు. అంతే అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా చలిజ్జ్బరం కమ్ముకుంది. మూడు రోజులలో చనిపోయాడు. 1811 ఆగష్టు 11వ తేదిన బటేవియాలో చనిపోయిన లీడెన్ మరణం సాహిత్యకారులను, చారిత్రక విశ్లేషకులను, భాషాఖిమానులను శోక సంద్రంలో ముంచేసింది.
లీడెన్ భారతదేశంలో అడుగుపెట్టిన నాటినుండి మరణించే వరకూ తొమ్మిదేళ్ళ ఉద్యోగ నిర్వహణలో 2106 సంపుటాల్లో విషయసేకరణ చేశాడు. తాను నేర్చిన భాషల పరస్పర సంబంధాలను విశ్లేషించాడు. ఆయన మరణానంతరం లాక్ హెర్ట్ రచించిన 'లైఫ్ ఆఫ్ స్కాట్ ' అనే గ్రంథంలో లీడెన్ వ్యక్తిత్వం, వైదుష్యం, కథలు, కథాగేయాలు, ఆయన రచనలు ప్రచురించారు. లీడెన్ సేకరించిన వాటిలో తెలుగు లిపిలో ఉన్నవి 272 అని లెక్క తేల్చారు. ఇన్ని వివరాలు సేకరించిన ఆరుద్రగారికి శతవందనాలు. ఈ వ్యాసానికి ఆకరువులయిన 'తెలుగుభాషకు విదేశీయుల సేవ ' రచయిత ఆచార్య జి.లలిత, “తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు” రచయిత డా.జోలిపాళెం మంగమ్మ గార్లకు కృతజ్ఞతలు.
“ఐజ్ఞానశా(స్తాన్న అమ్మభాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో "సైన్స్ స్పజనాత్మకత” పెరుగుతుంది. వాఠ్వాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తీ సమకూరుతుంది. నేను పదో తరగతి వరకూ మాతృభాషా మాధ్యమంలోనే చదువుకున్నా. తర్వాత ఆంగ్లం నేర్చుకున్నా. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూవించే నృజనాత్భుకతే వారి భవివ్వత్తుకు వునాది. ఆ నృజనాత్సకత అమ్మభాషలో చదువువల్లే సాద్యం.” _ ఎ.పి.జె. అబ్బుల్ కలామ్
కథలు, స్వప్పకావ్యము, వ్యాసములు
పానుగంటి లక్ష్మీనరసింహారావు
పుటలు:240
వెల:రు. 200/-
రచన: పానుగంటి లక్ష్మీనరసింహారావు
ప్రచురణ :వి.వి.ఐ. టి. విద్యాసంస్థ,
పంపిణీ: క్రియేటివ్లింక్స్ పబ్లికేషన్స్
హైదరాబాద్-501 505
సెల్ 98480 65658
నవీనాంధ్ర సాహిత్య నిర్మాతలలో చిలకమర్తి, పానుగంటి, మొక్కపాటి గణుతికెక్కినవారు. వీరిలో పానుగంటి వ్యంగ్వాత్మక విమర్శకులు, నాటకరచయిత. సంఘోద్దరణ వారి ధ్యేయం. వావిళ్ల వారు ప్రచురించిన సాక్షి సంపుటాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు ప్రత్యేకంగా “కధలు, స్వప్నకావ్యము, వ్యాసములు పానుగంటి లక్ష్మ్మీనరసింహారావు”-పేరుతో మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వి.వి.ఐ.టి విద్యాసంస్థ ఈ గ్రంథాన్ని ప్రచురించడం ముదావహం. ఇందులో 11కథలు, 14వ్యాసాలు, ఒక కావ్యం చోటు చేసుకున్నాయి. పానుగంటివారి కాలంలో వర్ణిల్లిన వ్యావహారిక భాషోద్యమం, భావకవిత్వం, నవ్య కవిత్వాలను హేళన చేస్తూ వాసినది -స్వప్నకావ్యం. ఇందలి 14 వ్యాసాలు వావిళ్ళవారు ముద్రించిన సాక్షి సంపుటాలలో లేనివి. 11 కథలలో సామాజికాంశాలు ప్రతిబింభిస్తున్నాయి. భార్యగుణమే సౌందర్యంకాని, భార్య సౌందర్యంగుణం కాదనే సందేశంతో కూడినది చిన్నకథ. 'హిందూ గృహిణి- దాంపత్యాజీవితానికి అద్దం పట్టింది. నలుపు తెలుపు తగులాటాల తమాషా-వేరీ నారాయణీయం”. అతిథి పూజామర్యాదలతో నిండిన -కానుగుచెట్టు”, వేశ్యాలంపటత్వంతో చిద్రమ్హైన కుటుంబగాధ -"శ్రీరామా!” బైరాగి దీక్షకు నిదర్శనం -“'జయసీతారామ్”. జోస్యం ఫలితానికి అద్ధంపట్టింది-'రామరాజు. ఇష్టంలేనిదాన్ని వదిలించుకోవడం కనబడుతోంది-'రామరామ 'లో.ప్లీడరు మోసాలు దర్శనమిస్తాయి- “ప్లీడరు పట్టు 'లో. దొంగకు కూడ దైవభక్తి ఉందని తెలువుతుంది -'శివరామా '. పందెంకోనం నటించడం 'హస్యకధలో వెల్లడవుతుంది. వ్యాసరచయిత, నాటక రచయితగానే కాక, కథారచయితగా కూదా పానుగంటి వారిని పరిచయం చేస్తుంది ఈ గ్రంథం, సాహిత్యాభిమానులందరు చదవదగినది.
డా|| వెన్నిసెట్టి సింగారావు సెల్ : 9893015584 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021 |