పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యాత్రాసాహిత్యం

మూల ర్లచన : జూలియా చార్లోటి

అనువాదం : కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ

డా. కాళిదాసు పురుషోత్తం

90006 42079

ఆమె లేఖలు

(గత సంచిక తరువాయి...)

13వ లేఖ

“ఈ దేశంలో స్త్రీ పురుషుడికంటే వందరెట్లు హీనం. స్త్రీ అంటే నిర్లక్ష్యం, నిరాదరణ. స్త్రీ విద్య వినాశనమేనని ఇక్కడి ప్రజల నమ్మకం.”

అక్టోబరు 31వ తేది ఉత్తరంలో 'ఆమె' చిన్న సంఘటనను వివరిస్తూ ముగింపుగా పై అభిప్రాయం వెలిబుచ్చుతుంది.

జడ్జిదంపతులు రాజమండ్రిలో నేటివు స్కూలు నెలకొల్పాలని అనుకొంటారు. తగిన ఉపాధ్యాయుడి కోసం వెదుకుతున్నారు కూడా. స్మూలు నెలకొల్పుతున్నట్లు నేటివులకు తెలియజేయడం, వారి పిల్లల్ని పంపుతామని మాట తీసుకోడం కూడా మరోవైపు జరుగుతోంది. ఇలా వుండగా శ్రీనివాసరావు అనే కోర్టు ఉద్యోగి (పోస్టాఫీసు హెడ్‌ రైటర్‌) జడ్జిగారిని చూడడానికి వచ్చాడు.

పిల్లల్ని స్కూలుకు పిలుచుకొచ్చే బాధ్యత తాను వహిస్తానని అన్నాడు. “ఆడపిల్లల స్కూలు పెడితే పిల్లలు వస్తారా?” జడ్జిగారు అతన్ని అడిగారు.

“రారండీ! అయినా ఆడపిల్లలకి చదువెందుకండీ!” అని సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని గురించి చాలా సేపు చర్చ సాగింది. కానీ శ్రీనివానరావు మాత్రం తన అభిప్రాయం మార్చుకోలేదు. స్త్రీలు చదువుకొంటే, అరిష్టం దావురిస్తుందని, బంధువులకు ఏదో కీడు మూడుతుందనీ, ముఖ్యంగా తల్లికో, తండ్రికో చావు తప్పకపోవచ్చునని అతను కచ్చితంగా అన్నాడు.

“మరి నేను చదువుకొన్నాను గదా, మా అమ్మవాళ్లు నిక్షేపంగా వున్నారే. యూరోపియన్‌ స్త్రీలందరూ చదువుకొన్నవారే, అయినా అందువల్ల వాళ్ళ చుట్టాలకు ఏ అరిష్టమూ జరగలేదే” అని ఆమె వాదించింది. ఐనా అతను వొప్పుకోలేదు -

“యూరోవియన్లకేం పర్వాలేదు, వాళ్లకేం కాదు, ఎటొచ్చీ నేటివులం మాకే ముప్పు” అన్నాడు అతను. అదంతా నిజం కాదని, నేటివులు బాగుపడకుండా చేసేందుకు ఏ పిశాచమో వాళ్ల తలల్లో ఈ ఆలోచన రేపి పెట్టిందని జడ్జిగారు నచ్చజెప్పబోతే -

శ్రీనివానరావు - “మీరు చెప్పేది నిజమైతే కావచ్చుగానీ, ఆడపిల్లలకు అంత తెలివితేటలు లేవుకదా, వాళ్లకు చదువెట్లా వస్తుందండీ?” అని ఎదురు ప్రశ్న వేశాడు. స్త్రీలు కుటిలస్వభావులని, అబద్దాలకోరులని, నీచులని కూడా ఇక్కడి వాళ్లు భావిస్తారంటూ, ఆమె యూరోపియన్‌ బాలురకు సహాయకులుగా స్త్రీలను నియమించడం ప్రమాదమనే అభిప్రాయం వ్యక్తపరుస్తుంది. ఆడవాళ్లు నమ్మకస్తులుకాదనే అభిప్రాయంతో పిల్లల్ని ఎత్తుకొని తిప్పడానికి మగవాళ్లను నియమించుకౌంటున్నారని ఈ సందర్భంలో వ్యాఖ్యానిస్తుంది.

స్కూలు ఏర్పాట్లు, సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంచి ఉపాధ్యాయుడు దొరకడం కష్టంగా ఉంది. రాజమండ్రి ప్రాంతాల్లో నేటివు క్రైస్తవులు లేరు. హిందువులను (11621609) నియమించడం జడ్జిదంపతులకు ఇష్టం లేదు. ఆదివారంనాడు అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతన్ని ఇదివరకెప్పుడూ జడ్జిగారు చూడలేదు. అతన్ని గురించి వాకబుచేయగా, ఏదో కోర్టు వ్యవహారం మీద రాజమండ్రి వచ్చాడని, రెండు రోజులుంటాడని, ఇంగ్లీషు బాగా అర్థం చేనుకోగలడని, దస్తూరి, ఉచ్చారణ బాగుంటాయని తెలిసింది. అతడు చర్చికి రావడాన్ని బట్టి గౌరవస్థుడే ననిపించిందంటుంది ఆమె. జడ్జిగారు అతనికి జాబు రాశారు, స్కూల్లో ఉపాధ్యాయుడుగా చేరమని.

చివరకు 25 మంది మగ పిల్లలతో స్కూలు ప్రారంభమైనట్లు అదే ఉత్తరంలో నవంబరు 23న రాసింది. స్మూల్లో చేరిన వారంతా పై కులాలవారే. బడికి అస్పృశ్యులను (౧౫129) తీసుకొని రావడం కంటే పై కులాల వారిని తీనుకొని రావడం కచ్చం గనక, పైకులాలవారికి చదువు చెప్పడమే మంచిదని, పై కులాలవారు చదువుకోడమే మేలని జడ్జిగారి అఖిప్రాయమని ఆమె ఆ ఉత్తరంలో రాస్తుంది. స్కూల్లో తెలుగు బోధించడాని కొక బ్రాహ్మణుడు, ఇంగ్లీషుకి దేవిడ్‌ గంజాల్వ్‌స్‌ (౧౪/6 60౧94/09) అనే మిశ్ర జుతి వ్యక్తి (౧౫1 0౬90) కుదిరారు.

ఒక రోజు ఉదయాన్నే ఆమె స్కూలు చూడ్డానికి వెళ్లింది. పొద్దున ఆరు గంటలకే బడికి రావడం ఇక్కడ పిల్లలకు అలవాటు. స్కూల్లో కులాలవారీగా పిల్లలు కూచుంటారు. బ్రాహ్మణ, వైశ్యుల పిల్లలు ఒకచోట, “మూవీ” (పనివాళ్ల) పిల్లలు మరొక వరస, ముస్లిం బాలురు ఇంకోవరస - ఇట్లా వుంటుంది ఏర్పాటు. వీళ్లందరి వెనక పెద్దవాళ్లు - వాళ్ళు తమాషా చూద్దానికి వస్తారు. చిక్కంతా వాళ్లతోనే! ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అందుకే వాళ్లను పరీక్షలపుడు మాత్రమే బడికి రానివ్వాలని అనుకొన్నారు.

పుస్తకాలు చాలా ఖరీదు కావడం వల్ల కొద్దిగానే తెప్పించారు. స్కూలుకయ్యే మొత్తం ఖర్చును జడ్జిదంపతులు, హామిల్టన్‌ దంపతులు భరించుకోవాలి. అందువల్ల పిల్లలకు బాగా ఉపకరించే మంచి పుస్తకాలు మాత్రమే కొంటున్నారు. స్పెల్లింగులు నేర్చుకొనే పుస్తకాలు కాకుండా, చదవడానికి కూడా పనికొచ్చే పుస్తకాలు మాత్రమే తెప్పించారు. అక్షరాలు, స్పెల్లింగులు, మొదటి పాఠాలను ఆమె పెద్ద అట్టమీద రాసింది. ఒక అట్టమీద రాస్తే, పిల్లలందరూ నేర్చుకుంటారు. అవి పుస్తకాల్లా ఉపయోగపడుతున్నాయి. స్కూలు గది చుట్టూ ఆమె అలాంటి అట్టలు తగిలించింది. పిల్లలకు మొదటిసారి ౧౪౫౧౫ 0/ 4-8.ను ఆమె ఎంపిక చేసింది. ఇలాంటి అట్టలు మద్రాసు నుంచి తెప్పించుకోవచ్చు, కానీ వాతావరణం అనుకూలంగా లేనందువల్ల ఓడల రాకపోకలు నత్రమంగా లేవు, రోడ్డు మీద పంపాలంటే ఆలస్యమవుతుంది. అప్పటిదాకా పిల్లలు వేచివుండడం ఆమె కిష్టం లేదు. తన బోధనలతో పిల్లల్ని వెంటనే క్రైస్తవులుగా మార్చెయ్యాలనే ఆశ ఆమెకూ లేదు కానీ, వాళ్లకు తాను “చేయదగింది యేదో | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |