పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడుగుజాడల్లో ఆనవాళ్లు-2

డా॥ ఈమని శివనాగిరెడ్డి 98485 98446

నా పిడుగురాళ్ల - పిల్లుట్ల యాత్ర

ముందుగా అనుకున్నట్లు రేపు తెల్లవారుజామునే బయలుదేరదామని అనుకొన్నాం. గుంటూరుజిల్లా మ్యాపు, టోపీ, ఒకటి రెండు బౌద్ధంపై పుస్తకాలు, (ప్రయాణంలో చదువుకోవటానికి) నోట్‌బుక్‌, అన్నీ సంచిలో సర్దుకొని, టీవీలో వార్తలు చూస్తూ, అన్నంతింటు న్నాను. ఇంతలో నాకు రావడం కుదరదని డైవర్‌నుంచి ఫోను. అన్నంమీద, వార్తలమీద ఆసక్తి ఆవిరైంది. తెల్లవారుజాము, 8.00గంటలకు బయలుదేరి, గుంటూరులో ఒకర్ని ఎక్కించుకొని పిడుగురాళ్ల పోదామనుకొన్న ప్లానుకు ఆటంకమొచ్చి పడింది. గబగబా అన్నంతిని, మరో మిత్రునిద్వారా, ఒకరోజువారీ డ్రైవర్ని మాట్లాడుకున్నాక మనసు స్థిమితపడింది. ఆడ్రైవరుకు ఫోనుచేసి, విజయవాడ, మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి ఛాంబర్స్‌, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ & అమరావతి దగ్గరకు రమ్మని చెప్పాను. నా సహోద్యోగి చందూ కార్తీర్‌ను, కెమెరా తీసుకొని సిద్ధంగా ఉండమని చెప్పి, రేపటి యాత్రలో మునిగి, తెలియకుండానే నిద్రబోయాను.

అనుకున్నట్లుగానే మరునాటి ఉదయం 8.00గంలకే బయలుదేరి, గుంటూరులో ఒక మిత్రుణ్జి ఎక్కించుకొని తెల్లారేసరికి పిడుగురాళ్ల చేరాం. అక్కడ జర్నలిస్టు, ప్రముఖ రచయిత, పల్నాడు మీద పరిశోధనలు చేసిన కె, హెచ్‌.వై.మోహనరావుతో కలసి టీతాగి, పిల్లుట్లకు బయలుదేరాం. ఊరు దాటామో లేదో మోహనరావు మళ్లీ ఫోను చేసాడు. వెనక్కి తిరిగి వచ్చి ఆయన ఇచ్చిన “గుంటూరు జిల్లా దేవాలయాలు” అన్న పుస్తకాన్ని తీసుకొన్నాను. పిడుగురాళ్ల అంటే మా చిన్నతనం మాటొకటి గుర్తుకొచ్చింది. తెనాలి పంచాయితీ సమితి ప్రెసిడెంటు కనుసన్నల్లోలేని హైస్కూలు టీచర్లను పిడుగురాళ్ల బదిలీ చేస్తారనే మాట అది. ఇప్పుడు పిడుగురాళ్ల మంచి టౌనైంది కాని ఆరోజుల్లో (1965-66 ప్రాంతంలో) నీళ్లు దొరక్క ఇబ్బంది పదేవాళ్లు. ఎండాకాలం వేడి ఎక్కువుగా ఉండటాన, అక్కడ పిడుగులు రాళ్లలా కురుస్తాయనే అర్ధంలో ఆ వూరికి పిడుగురాళ్ల అని పేరు పెట్టారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు పిడుగురాళ్లలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగైనాఒక పగిలిన రాతిపైగల క్రీ.శ.1318వ సం॥పు శాసనం నాకు ఊరట నిచ్చింది. పాకుడుబట్టి రూపు పోగొట్టుకొన్న అక్షరాల్ని తడిమ తడిమి చదివితే, అది అన్మకొండ పురవరాధీశ్వరుదైన కాకతీయ ప్రతాపరుద్ర దేవమహారాజులకు పుణ్యంగ్కా ..వయిలెంకంగారి పుత్రుడు, అయోధ్య రామలక్ష్మణులకు చేసిన అస్పష్ట దాన వివరాలున్నాయి.

ఒక్క అడుగు ముందుకేసిన తరువాత 1882లో రాబర్ట్‌ సివెల్‌ చూచిన పిడుగురాళ్ల గుర్తుకొచ్చింది. పిడుగురాళ్లలో అమరావతిని పోలిన పెద్దదిబ్బ, దానిచుట్టూ పాతకాలపు కుండపెంకులూ ఉన్నాయని పాత పిడుగురాళ్లలో రెడ్డిరాజుల కోటగోడ శిధిలాలున్నాయనీ, ట్రావెలర్స్‌ బంగ్లా ఆవరణలో మాధవరామమ్మ, మంగమ్మ, పిడుగురాళ్ల విషం విల్లమ్మ అనే మూడు శిల్పాలున్నాయనికూదా సివెల్‌ రాశాడు. సతీసహగమనం చేసిన మంగమ్మ 'పేరంటాలుగా ఇప్పటికీ కొలవబడుతుంది. పాత కోటగోడ పక్మనేగల ఒక చిన్న శిధిలాలయంలో ఒకప్పుడు ప్రజల్ని పీడించుకుతిన్న ఒక స్త్రీని, “పిడుగురాళ్ల విషం పిల్లి అని కొలవటం, ఆమె మళ్లీ వాళ్లజోలికి రాకూడదనే మూఢనమ్మకమే. పాతకోట శిధిలాల్లో చూచిన పాతపాటేశ్వరి, గోపాలస్వామి, రామలింగ స్వామి ఆలయాలు, గణపతి ఖైరవ, మహిషాసురమర్దని, వీరగల్లులు నాగదేవతలు, సప్తమాతల శిల్పాలు, క్రీ.శ. 1552 నాటి శాసనం, ఆనవాళ్లు కోల్పోయి, పిడుగురాళ్ల సంతకాన్ని చెరిపేశాయి. చరిత్ర పరిశోధకులకు తీరని వ్యధను మిగిల్బాయి. దగ్గరలోనే క్రీ.శ. 5వ శతాబ్దికి చెందిన, ప్రసిద్ధ థేరవాద తెలుగు బౌద్ద్ధాచార్యుడు, శ్రీలంకలో బౌద్ధ సంఘనాయకుడిగా ఎన్నుకోబడిన ఆచార్య బుద్ధఘోషుని జన్మస్థలం కోటనెమలివురిని చూద్దామనిపించింది. అక్కడ ప్రతిష్టించిన ఆయన విగ్రహాన్ని చూచి, తెలుగునేలపై థేరవాద బౌద్ధాన్ని ప్రచలితంగావించిన ఆయన గొప్పతనాన్ని కొనియాదాలని పించింది. బౌద్ధానికి పునాదిరాశ్లైిన శీలం, సమాధి, ప్రజ్ఞలపై ఆ మహనీయుడు రాసిన 'విశుద్ధిమగ్గ, త్రిపిటకాలపై రాసిన వ్యాఖ్యానాలు సామంతపాసాదిక, సుమంగళ విలాసిని, పపంచ సూదని, జాతక, అంధక అత్థకధలనే గ్రంథాలను స్మరించుకోవాలని వంచింది. పాళీ సింహళ ఖాషలపై బుద్ధఘోషని సాధికారిక పాండిత్యాన్ని శ్లాఘించాలనిపించింది. అనుకౌన్నదే తడవుగా అక్కడికెళ్లి ఆయన విగ్రహాన్ని చూచి, మొక్కి వెనక్కి మళ్లాను.

ఈ తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకొంటూ తెలుగు వారి తొలి నరసింహస్వామి విగ్రహం దొరికిన ప్రాంతాన్ని చూద్దామని పిడుగురాళ్ల నుంచి 4 కి.మీల దూరంలో ఉన్న కౌండమోడు చేరుకున్నాను. స్థానికులను ఎవరినడిగినా తెలియదంటున్నారు. అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు చూపించిన

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ అక్టోబరు-2020