పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చొారవ, పరిశోధనతో ఇది బయటపడింది. పీవీ మరణానంతరం 2 జనవరి 2005 నాటి 'వార్త' దినవత్రిక ఆదివారం ప్రత్యేక సంచికలో ఈ కథ పునర్శుద్రితమైంది.

ఆ రోజుల్లో పీవీ గారు “జయా “విజయ”, “రాజహంసొ “భట్టాచార్య”, “రాజా” “విజయం” ఇత్యాది మారు పేర్లతో ఈ రకమైన కథలు, వ్యాసాలు ఎన్నో రాసి, తాము వరంగల్‌ నుంచి నిర్వపొన్తున్న కాకతీయ వత్రికలోనూ, ఇతర పథత్రికల్లోనూ ప్రచురించారు. ఆ తరువాత పుట్టిన తన కుమార్తెలకు “జయ, విజయ” అనే పేర్లనే పెట్టుకున్నారు.

మంగయ్య అదృష్టం

పీవీ రాసిన మరొక పెద్ద కథ 'మంగయ్య అదృష్టం”. ఇది 1999 నవంబర్‌ 8 నాటి ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురితమైంది. దీనిని ఆ వత్రికవారు నవలిక అని పేర్కొన్నారు. ఏమాత్రం విద్యాబుద్దులు లేని ఒక నీచుడిని కూడా అదృష్టం వుంటే, ఎన్ని అవరోధాలెదురైనా, రాజకీయ పదవులు ఏ విధంగా వరిస్తాయో తెలిపే వ్యంగ్య రచన ఇది. ఆద్యంతమూ ఒకే అంశంలో సాగిన ఈ రచన ఒక ఆహ్లాదకరమైన 'పొలిటికల్‌ సెటైర్‌. దేవతల మధ్య చెలరేగిన ఒక అంతః కలహం తారాస్థాయికి చేరి తమతమ శక్తులను పరీక్షించుకోడానికి మంగయ్య అనే ఒక అనామక నిరక్షరకుక్షిని ఎంచుకున్న అపూర్వ ఘట్టం దీని ఇతివృత్తం. పీవీ గారు ఎంత సమర్థంగా అధిక్షేపాన్ని రచనలో నిర్వహించగలరన్నదానికి ఇదొక ఉదాహరణ.

సారోస్‌ ఆఫ్‌ ఎ మినిస్టర్‌ (ఒక మంత్రి గారి బాధలు)

1968 జనవరిలో హైదరాబాద్‌లో అఖిల భారత కాంగైెన్‌ కమిటీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేక సంచిక ప్రచురణ బాధ్యత పీవీ నరసింహారావు గారికి అప్పగించబడింది. సావనీర్‌ కమిటీ వైర్మన్‌ పీవీ గారే. 07.01.1968 న విడుదలైన ఈ సావనీర్‌లో పీవీ గారు ఆంగ్లంలో “సారోస్‌ ఆఫ్‌ ఎ మినిస్టర్‌” (ఒక మంత్రి గారి బాధలు) పేరుతో ఒక కథను రాశారు. ఎన్నికల సమయంలో తమ వారితో ఓట్లు వేయించి, గెలిపించిన ముఠా నాయకులు, ఆ నేత గెలిచి మంత్రి అయిన తరువాత తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి నిబంధనలను తుంగలో తొక్కి ఎంత అడ్డగోలుగా వనిచేయమని ఆయనను వేధిస్తారో వివరించే వ్యంగ్య చిత్రీకరణ ఈ కథ. ఇది వీవీ గారి స్వానుభవం గానే భావించవచ్చు.

ది ఇన్సైడర్‌ (లోపలి మనిషి)

పీవీ గారి సృజనాత్మక రచనా వైదుష్యానికి పరాకాష్ట ఆయన ఆంగ్లంలో రాసిన బృహన్నవల “ది ఇన్ఫైడర్‌”. దీనిని రచించడం తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రారంభించి, ప్రధానమంత్రిగా తన పదవీకాలం పూర్తయిన తరువాత తీరిక సమయంలో వేగం పెంచి, తుదిమెరుగులు దిద్ది పూర్తిచేశారు. దీనిని తెలుగులోకి కల్లూరి భాస్కరం గారు “లోపలి మనిషి” పేరుతో అనువదించారు.

అదధ్గిక్షేపం, అవవోాన్యం, ఎత్తిపొడుపు, ఉపాలంభనం, అన్యాపదేశం నిర్వహించడంలో ఆయన ఎంత సమర్భులో ఈ రచన నిరూవిస్తుంది. ఈ (గ్రంథం తన ఆత్మకథ కాదని, “భారతదేశపు డైరీ” అని స్వయంగా పీవీ గారే పేర్కొన్నారు. ఆయన అంతర్మథనం ఈ నవల ద్వారా బాగా వ్యక్తమైంది. ఆత్మసంవేదనా పూరితుదైన ఒక వ్యక్తి బాహిరంగా, పరిస్థితుల వత్తిడితో కొంత రాజీపడినా, ఆ వ్యక్తి అంతరంగ వేదనలు వేరుగా వుంటాయని చెప్పడం ఈ రచన ఉద్దేశ్యమని భావించవచ్చు.

“ఈ రచన ఆత్మకథ కాదు. కాల్పనిక రచనవలె రచయిత స్వచ్చంద ఊహలను అనుసరించేదీ కాదు. ఇది కల్పనాయదార్థాల సమ్మిశణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి కథాకారుడు, విమర్శకుడు - ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు రచయిత. ఈ విశిష్ట నేపథ్యంలో ఇదా, అదా అనే మీమాంస రచనను పుట్టుకతోనే వెన్నాడుతూవుంది. దేశ స్వాతంత్రోద్యమంలో తుది ఘట్టం నుంచి నేటి వరకు లోపలి మనిషిగా రాజకీయ, సాంఘిక వికాసక్రమాన్ని సాధ్యమైనంత వ్యక్తి నిరపేక్షంగా పరిశీలించిన వాడిని కనుక ఈ రచనా సౌధం గట్టి నేలపై నిలుచుని వుందనగలను. రాబోయే కాలంలో ఆఘాత విన్మయాలు కలిగించే అనేక నమన్యలను దేశం, (ప్రవంచం ఎదుర్కోబోతున్నాయి. అందుకని ఈ రచనా వస్తువు అనంతంగా ఉంటుంది. అనంతమైన నూతన రచనల నృష్టికి అవకాశాలు కల్పిస్తుంది. ఇది నిస్సందేహం. ఈ ఒరవడిలో ప్రారంభ ప్రయత్నాలలో ఆవిర్భవించినందుకు లోవలి మనిషి తన భాగ్యానికి సంతోషిస్తున్నాడు” అని పీవీ గారు “లోపలి మనిషి” మున్నుడిలో స్వయంగా పేర్కొన్నారు.

వ్యక్తులలో గుణదోషాలను నమానంగా, నిస్పాక్షికంగా ప్రదర్శించడానికి పీవీ ఇందులో ప్రాధాన్యమిచ్చారు. రచనా శైలి (ప్రవాహంలాగా సాగుతుంది. ఎక్కడా ఎలాంటి తడబాటు కానీ అవాంతరాలు కానీ వుండవు. చెప్పదలచుకున్న విషయాన్ని సుస్పష్టంగా. అలతి పదాలలో ఆయన చెప్పారు.

ఇందులో కథానాయకుడు ఆనంద్‌ - పీవీ ఒక్కరే అంటారు. తెలియని అవాస్తవాలను కల్పించి చెప్పడం కన్నా తెలినిన విషయాలను, తన అనుభవాలను ఈ పాత్ర ద్వారా చెప్పారు పీవీ. అయితే ఆనంద్‌ పాత్ర - నరసింహారావు గారి ప్రతిరూపం కాదు. ఆనంద్‌ పాత్రను కొంత వాస్తవం, కొంత కల్పనతో ఆయన మెరుగులు దిద్దారు.

అయోధ్య

1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రధానమంత్రిగా పీవీనే బాధ్యుడని ఆయనపై పెద్ద నిందే పడింది. ఈ సంఘటన పై ఆయనను నిందించిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ లోని తన సహచరులే ముందు వరుసలో నిలిచారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను దేశానికి తెలియజేయటానికి, తనపై నిష్కారణంగా వచ్చిన ఈ నిందను బాపుకోవదానికి వీవీ గారు “అయోధ్య” పేరుతో నివేదికలాంట్ని ఒక గ్రంథం రాశారు.

(తరువాయి వచ్చే సంచికలో...)

తెలుగును బోధించడమే కాదు అన్నీ తెలుగులోనే బోధించాలి | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |