పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వలసవాదం

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు

9866 28846

అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం

అభివృద్ధి చెందిన దేశాల భాషలు ప్రపంచ భాషలుగా చెలామణి కావటం, అట్లా వాటిని చెప్పుకోవటం అనే కొత్త పోకడ ఒకటి మన మానవాళి సంస్కృతిలో భాగమైంది. ఇంగ్రీషు, ఫ్రెంచి, స్పానిష్‌, పోర్చుగీసు, మొదలైనవాటిని ప్రపంచ భాషలని అనడం పరిపాటైపోయింది. అసలు ప్రపంచ భాషలంటే ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడటం, నేర్చుకోవడం, అనేకమంది వాటిని రెండవ భాషగా వాడటం, జనాభా పరంగానే కాక, భౌగోళికపరమైన విస్తరణా, అంతర్జాతీయ సంస్థలూ దౌత్య నంబంధాలలో వినియోగం మొదలైన లక్షణాలను కూడా కూడగట్టుకొని వర్గీకరణ జరుగుతోంది (ప్రపంచ భాషలని జి-? భాషలుగా పేర్కొంటూ మరికొన్ని, అరబిక్‌, చైనీసు, హిందీని కూడా కలుపుకున్నా పైన చెప్పినవాటికి ఉన్న రక్తసిక్త చరిత్ర వీటికి ఉన్నట్లు లేదు).

అయితే వీటికి ఈ లక్షణాలు ఎట్లా వచ్చాయి, ఇవి మాత్రమే ప్రపంచ భాషలుగా ఎట్లా ఎదిగాయో మనం తెలుసుకోవాలి. ఇవి (ప్రపంచ భాషలుగా రూపుదిద్దుకొనే క్రమంలో విచక్షణారహితంగా జరిగిన ఆదివానుల జననష్టం, దురాక్రమణలూ, వలసవాదుల హింసా ప్రవృత్తి, ఇవి దేశీయ భాషలూ వాటిని మాట్లాడే జాతుల, తెగల జనాభా అడుగంటిపోవదానికి కారణం అని ఎన్నో వరిశోధనలు నిరూపిస్తున్నాయి.

పదిహేనవ శతాబ్దం ముగిసేనాటికి భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే నెపంతో ఇద్దరు నావికులు తమ నౌకా దండుతో ప్రయాణమయ్యారు. వారిలో ఒకరైన క్రిస్టోఫర్‌ కోలంబన్‌, స్పైన్‌ నుంచి బైలుదేరి (1492) పడమటివైపు ప్రయాణించి అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని దాటి మధ్య అమెరికాలోని బహామా దీవులను (ఇప్పటి మధ్యఅమెరికాకు చేరువలో ఉన్న దీవులు) చేరుకొని దాన్నే ఇండియాగా బ్రమించాడు. అవే తర్వాత వెస్ట్‌ ఇండీస్‌ అంటే పడమటి ఇండియా దీవులుగా టప్రనిద్ధి చెందాయి. రెండవ దండుకు నాయకత్వం వహిస్తూ వాస్కో డా గామా పోర్చుగల్లులోని లిస్బన్‌ నగరం నుంచి బైలుదేరి (1497) తూర్పువైపు ప్రయాణించి ఆఫ్రికాను చుట్టి హిందూ మహాసముద్రం మీదుగా కేరళలోని కాలికట్‌ నగరానికి చేరుకున్నాడు. ఈ రెండు అన్వేషణలూ భారతదేశంలోని విలువైన సుగంధద్రవ్యాలూ, బంగారం, వజ్రాలు మొదలైనవాటి వ్యాపారం కోసమే అయినా చివరకు ప్రపంచ చరిత్రను ఊహించనటువంటి మలువుతిప్పాయి. వీటివలన అమెరికా, ఆఫ్రికా ఆసియా చివరకు ఆస్ట్రేలియా ఖందాలలోని కోట్లాదిమంది దేశీయ తెగలూ జాతుల జన నష్టంతో బాటు, వారి భాషలూ వాటితోబాటు వారి నంన్కృతులకూ అంత్య కాలం దాపురించింది. ఈ సముద్ర మార్గాలను కనుగొన్న ఐరోపా వాసులు వాటిని వ్యాపారానికి కాక ఇతర ఖండాలలోని తెగలూ జుతులపైన దాడిచేసి, ఆక్రమించి వలసదేశాలుగా మార్చివేసేందుకు వినియోగించారు.

పోర్చుగీసు ఒక భాషగా గుర్తింపు పొందినది 12వ శతాబ్దంలో. అప్పటివరకూ దానికి ఒక గ్రామ్య భాషగానే అంటే లాటిను

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |

మాండలికంగానే గుర్తింపు ఉండేది. 1296లో రాజభాషగా వాడేందుకు నిర్ణయం జరిగింది. 12-14 శతాబ్దాలలో వాడిన పోర్చుగీసును ప్రాచీన పోర్చుగీసు అనేవారు. 15636 లో మొట్టమొదటి సారి పోర్చుగీసు భాషా వ్యాకరణాన్ని గ్రంథస్తం చేశారు. అయితే 15-16 శతాబ్దాలలో పరిశోధనలూ అన్వేషణల మూలంగా సొంత దేశపు ఎల్లలను దాటి ప్రపంచంలోని ఇతర దేశాలకు సాగిన వలసలలో భాగంగా పోర్చుగీసు ప్రపంచ భాషగా విస్తరించింది. ప్రస్తుతం 10 చిన్నా పెద్ద దేశాలలో అధికార భాషగానూ మొత్తమ్మీద షుమారు 28 కోట్లమందికి ప్రధాన భాషగా ఉన్నా అసలు పోర్చు గల్లులో పోర్చుగీసు మాట్లాడేవారి జనాభా మాత్రం కోటి మంది మాత్రమే.

2015 లో ప్రపంచంలో ఇంగ్లీష్‌ మాట్లాడేవారు ప్రపంచవ్యా ప్తంగా 150 కోట్లమంది (ప్రపంచ జనాభా మొత్తం 700 కోట్లు) ఉన్నారని ఒక అంచనా (సెయింట్‌ జార్జ్‌ ఇంటర్నేషనల్‌, ద లాంగ్వేజ్‌ స్పెషలిస్ట్‌). వీరిలో ప్రథమ భాషగా కంటే, రెండవ, మూడవ భాషగా మాట్లాడేవారి సంఖ్యే ఎక్కువ.

2015 లో, ప్రపంచంలోని మొత్తం 195 దేశాలలో, 67 దేశాలలో “అధికారిక హోదా” తో ప్రాధమిక భాషగా ఇంగ్లీషు ఉన్నా ఇంగ్లీషును ద్వితీయ “అధికారిక భాషగా మాట్లాదే 27 దేశాలు కూడా. ఉన్నాయి.

ఇక వేరే (1005://90101.61013600/069823%.0090/ 40ఫస(0రేఖం%6యై గణాంకాల ప్రకారం బ్రిటన్‌, ఐర్లాండ్‌, యుఎస్‌ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లాంటి కొన్ని కరేబియన్‌ దేశాల ప్రధానభాష లేక స్థానిక భాష ఇంగ్లీష్‌ కానీ 57 దేశాలలో (ఘనా, నైజీరియా, ఉగాంద్యా, దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్తాన్‌, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, ఫిజి, వనాటు మొదలైనవి), ఇంగ్లీషును “అధికారిక హోదా” కలిగిన భాషగా వాడుతారు. ఇవి ఎక్కువగా మాజీ వలసరాజ్య దేశాలు, ఇవి ఇంగ్లీషును వాటి ముఖ్య వ్యవస్థలలో వాడుక భాషగా చేశాయి. ఆపైన అత్యంత ప్రజాదరణ పొందిన అధికారిక వలస భాష (ఫ్రెంచ్‌ (31 దేశాలకు వర్తిస్తుంది). తరువాత స్పానిష్‌ (25దేశాలలోనూ), పోర్చుగీస్‌ (13 దేశాలలోనూ) అధికారిక లేక ప్రధాన భాషగా గుర్తింపును పొందాయి.

మ2-14 శతాబ్దాలలో ఐరోపా ఖండంలో వచ్చిన బ్లాక్టెత్‌ మళ్లీమళ్ళీ తిరగబెట్టిన ప్లేగువ్యాధులూ, కరువుకాటకాలవల్లా యుద్ధా లవలనా వాటికి తోడు అరాచకత్వం, తిరుగుబాట్లు, దోవిడీలతో మందగించిన ఆర్థిక వ్యవస్థతో ప్రజాజీవనం చిన్నాభిన్నం అయింది. 15వ శతాబ్ది చివరికి ఇంగ్లీషువారి జనాభా 80 లక్షలు మించదని పరిశోధకుల అభిప్రాయం (మిడిఎవల్‌ పాపులేషన్‌ దైనమిక్స్‌ టు క్రీ.శ. 1500, పార్ట్‌ సి: ద మేజర్‌ పావ్యులేషన్‌ చేంజస్‌ అండ్‌ డెమోగ్రఫిక్‌ ట్రెండ్స్‌ ఫ్రమ్‌ 1250 టో చ. 1520).

అయితే, 16వ శతాబ్ది మొదటిపాదంలో ఆర్థిక వ్యవస్థగాడిలో పడటంతోబాటే రాజకీయంగానూ ఇంగ్లండు బలోపేతం అయింది. 16 వ శతాబ్దం చివరి నుండి 18 వ శతాబ్దం ప్రారంభందాకా,