పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేసుకోవాలంటే కొత్త జాతీయ విద్యావిధానాన్ని సూక్ష్యంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ భాషలను నేర్చుకుని మన విద్యార్థులు అత్యంత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఈ విధాన నిర్మాతలు - అందుకోసం మాతృభాషల్ని శక్తిమంతం చెయ్యాలన్న మౌలిక అంశాన్ని విస్మరించారు!

భావతోపాటు చర్చించాల్సిన అంశాలెన్నో జాతీయ విద్యావిధానంలో ఉన్నాయి. మనదేశంలోని సామాజిక అసమానతలు, చారిత్రక సమస్యలు, సాంస్కృతికతలోని వైవిధ్యాలు లాంటి అంశాల గురించి ఈ విద్యావిధానం మాట్లాడినా, వాటి విషయంలో చేపట్టడలచిన చర్యలన్నీ ఆ సమస్యల పరిష్కారానికి, శక్తివంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించే దిశగానూ ఏమాత్రం దోహదం చేయలేవు. పైగా ఈ సమాజాన్ని మరింతగా వైరుధ్యాలతో నిర్వీర్యం చేయడానికే పనికివస్తాయి. మొత్తంగా ఈ విద్యావిధానం పెద్ద పెద్ద ఆలోచనలతో ఆశయాలతో నిండివున్నా, అందుకు అనుసరించదలచిన వ్యూహాలు, విధానాల కారణంగా విరుద్ధమైన వలితాలనిచ్చేదిగా ఉందని చెప్పక తప్పుదు.


తెలుగు వెలుగు” సెప్టెంబరు 2020, సంచిక సౌజన్యంతో

“తమిళనాడులో ఆంగ్ల మాధ్యమం వైపు.

10 వ పుట తరువాయి.......

తెచ్చుకున్నది. తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ వారి 2016-17 విధాన పత్రంలో * పిల్లలకు గరిష్టంగా సదుపాయాలను కల్పిస్తూ, తద్వారా, సాంథింక, ఆర్థిక అడ్బంకులను, అవరోధాలను అధిగమిస్తూ, అందరికీ చదువుకునే విశాల అవకాశాన్నికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. అంతేకాకుండా, సాంఫిక-ఆర్థిక అడ్డంకులు లేకుండా పిల్లలందరూ చదువుకొనునట్లుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టటడంలో అ(గ్రగామి తమిళనాడు. అన్ని ప్రభుత్వాలు తమ సాఫల్యాలను అతిశయంగా చెప్పుకుంటాయి. కళ్ళ ముందున్న వాస్తవాలను ఒప్పుకుంటున్నప్పటికీ, విద్యాశాఖ వారి దృష్టిలో మాత్రం, నిర్ణీత పట్టిక వేరకు సదుపాయాలు కల్పించడం వల్లే ప్రాథమికవిద్య పెంపొందించబడుతుంది. ఈ నిర్ణీత పట్టికలోని వస్తువులైన - యూనిఫాంలు, జామెట్రీ పెట్టెలు, పుస్తకాలు, ఆంగ్ల మాధ్యమం ఇస్తేనే అది సాధ్యమవుతుంది . కానీ బోధనామాధ్యమం మార్చడమన్నది సంచులు, సుద్దముక్కల పెట్టెలు ఇచ్చినంత సులువు కాదు.

ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యలో “ఉచిత” యూనిఫాంలు, నంచులు, వుస్తకాలు ఇవ్వడం ఒక కోణం. (ఫైవేటు (సొంత) పాఠశాల _ విద్యార్థులకున్న అవకాశాలకన్నా తక్కువ స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నారు. కాని, ప్రభుత్వపాఠశాలలో చదువుకోవ డానికి సమానమైన అవకాశాలు కల్పించామని అధికారులు చెప్పుకోవడం పరిపాటి. ఇది పెద్ద మోసం.

(Why Tamil Nadu shift to English Medium instruction is not helping children వ్యాసానికి ఇది తెలుగుసేత.)


12 వ పుట తరువాయి....


అనే త్రిభాషా విధానం అమలు కావచ్చు. మాతృభాషను తప్పనిసరి చేయని ఈ త్రిభాషా విధానం వలన విద్యావ్యాపారీకరణ నేపథ్యంతో మాతృభాషలకే గండం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక మూడు భాషలకు అదనంగా ఏదేన ఒక భాషను (ఫ్రెంచ్‌, జర్మన్‌, కొరియన్‌, జపనీన్‌ వంటివి) ఒక ఐచ్చిక పాఠ్య విషయంగా తీసుకోవచ్చని జాతీయ విద్యావిధానం 2020లో పేర్కొనబడింది. ఈ విధానంలో అకడమిక్‌ కోర్సులైన సామాజిక, ప్రకృతి మరియు గణిత శాస్త్రాల వంటివి కూడా ఐచ్చిక పాఠ్య విషయాలుగా కుదించబడ్దాయి. అంటే ఎవరైనా ప్రకృతి, సామాజిక మరియు గణిత శాస్త్రాలలో ఒకదానిని (ఆచరణలో సామాజిక శాస్త్రాన్ని) విడిచిపెట్టి ఆంగ్లానికి అదనంగా. మరొక విదేశీ భాషను ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఈ వీలును ప్రధానంగా ఉపయోగించుకునేది ప్రైవేటు పాఠశాలలు. ఒక స్థాయి వైవేటు పాఠశాలలలో జర్మనీ, జపనీస్‌, కొరియన్‌ వంటి భాషలకు డిమాండు ఉంది. ఆ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్దేశాన్ని రూపొందించి ఉండవచ్చు. ఈ విధానం అమలు జరిగితే అధిక ఫీజులు వసూలుచేసే ఐదు నక్షత్రాల ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థులు సామాజిక శాస్త్రాలు నేర్చుకోకుందానే పై స్థాయిలకు వెళ్ళిపోతారు. అట్టివారు నైపుణ్యం కలిగిన కార్బోరేటు మేనేజర్లు కాగలరు గాని సామాజిక స్పృహ కలిగిన పౌరులు మాత్రం కాలేరు. ఈ విధానం యొక్క పర్యవసానంగా తెలుగు రాష్ట్రాలలో, ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం ఉన్న త్రిభాషా విధానం కొనసాగే అవకాశం ఉండగా, ప్రైవేటు పాఠశాలలలో తెలుగును తొలగించి 6వ తరగతి నుంచే నంస్కృతం ప్రారంభం కాగలదు. త్రిభాషావిధానంలో భాగంగా మాతృభాషను తప్పనిసరి చేయకపోవడం మరిమొకవైవు సంస్కృతాన్ని అన్ని పరిధులు దాటి ప్రోత్సహించడం, మాతృభాషా మాధ్యమాన్ని ఐదవ తరగతికి పరిమితం చేయడం ఈ విధానంలో (ప్రధానమైన సమస్యలు. ఈ విధానం పేదల ఎడల మాత్రమే కాక భాషల ఎడల కూడా వివక్షగా పరిణమించగలదు.

రచయిత అఖిలభారత విద్యాహక్కువేదిక అధ్యక్షవర్గ సభ్యులు

ఈ వ్యాసంలో కొంతభాగం “ఆంధ్రజ్యోతి”

15 సెప్టెంబరు 2020 సంచికలో వచ్చింది.


'వికీపీడియా'కు మప్పిదాలు

'సెష్టెంబరు సంచికలో శ్రీ రహ్మానుద్దీన్‌ రచించిన “ఈశాన్య రాష్రాల జనజాతుల భాషలకు పొంచివున్న ముప్పు” వ్యాసానికి సంబంధించి 9,10,11, పుటల్లోనూ ముఖచిత్రంలోనూ ప్రచురించిన ఫోటోలను 'వికీపీడియా” నుంచి తీసుకొన్నాము. వారికి మప్పిదాలు -సం.

భాష నశిస్తే జాతి నశిస్తుంది. వాడని భాష వాడిపోతుంది

తెలుగుజాతి పర్రిక అవ్మునుటె ఈ అక్షోబరు-2020