పుట:అక్షరశిల్పులు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


వెల్లడిస్తూ, బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత హిందూ-ముస్లిం జన సముదాయాల మధ్యసంబంధాలను మరింతగా పటిష్టం చేయాలన్నలక్ష్యంగా ప్రత్యేకంగా బుర్రకథలు, నాటకాలురాసి ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో స్వయంగా ప్రదర్శించారు. లక్ష్య: సమసమాజస్థాపన. చిరునామా: షేక్‌ అహమ్మద్‌ బాషా, ఇంటి నం.11/706, ఏ.సి.యస్‌ రోడ్‌, సుందర్‌ డీలక్స్‌ వద్ద, సంతపేట, నెల్లూరు-524001, నెల్లూరు జిల్లా, సంచారవాణి: 99490 72401, Email: royalahmedbasha@gmail.com

అహమ్మద్‌ బాషా సయ్యద్‌: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. రచన: శ్రీ ప్రవక్త ముహ్మద్‌ రసూల్‌ వారి దివ్య చరిత్ర.

అహమ్మద్‌ మహమ్మద్‌: మెదక్‌ జిల్లా మెదక్‌లో 1962 డిసెంబర్‌ 25న జన్మించారు. తల్లితండ్రులు: యాకూబీ, మహమ్మద్‌ మూసా. చదువు: ఎం.ఎ., బి.ఇడి. ఉద్యోగం:ఉపాధ్యాయులు. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ప్రేరణతో 1984లో సాహిత్యరంగ ప్రవేశం.1986 'మౌనం' కవిత ప్రచురితం. అప్పటినుండి వివిధ పత్రికలు, కవితా సంకలనాలలో పలు కవితలు, కథానికలు ప్రచురితం.

ప్రచురణలు: పానాది (కవితా సంపుటి, 2008). లక్ష్యం:

సామాజిక రుగ్మతలను విమర్స నాత్మకం గా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడగల సాహిత్యాన్ని రాయడం. చిరునామా: మహమ్మద్‌ అహమ్మద్‌, ఇంటి నం. 1-12-29/20, అజయ్‌ునగర్‌ కాలనీ, మెదక్‌-502 110, మెదక్‌ జిల్లా. సంచారవాణి : 94415 36433.

అక్బర్ బాబు షేక్: ఖ్హమ్మం జిల్లా ఖమ్మంలో 1952 ఏప్రిల్‌ ఆరున జననం. తల్లితండ్రులు: షేక్‌ జమాల్‌ బీ, మహ్మద్‌ అలీ. కలంపేర్లు:

మహ్మదీ కుమార. చదువు: 8వ తరగతి. ఉపాధి: వెల్డింగ్ వర్కర్‌.

1995లో గీటురాయి వారపత్రికలో 'ధ్యేయం' కవిత ప్రచురణ. అప్పటి నుండి వివిధవార పత్రికలలో వ్యాసాలు ప్ర చురితం . గీటురాయిలో వచ్చిన ధార్మిక వ్యాసాలు గుర్తింపును తెచ్చి పెట్టాయి. లక్ష్య: రచనల ద్వారా ధార్మిక ప్రచారం. చిరునామా: షేక్‌ అక్బర్‌ బాబు, ఇంటి నం.1-935/48/42/2, ఇస్లాంపేట, ఖమ్మం, ఖమ్మం జిల్లా. సంచారవాణి : 99519 21335.

అక్బర్‌ బాబు షేక్‌
అక్బర్‌ ఎస్‌.ఎం: 1939 జనవరి నాటి 'గృహలక్ష్మి' పత్రికలో (ఆనాడు, ఈనాడు కూడ)

చాలా చర్చనీయాంశంగా మారిన 'వెధవ ఘోష' కథను రాశారు.

41