(హైదారాబాద్), ఎం.ఏ సాలార్ (వినుకొండ, గుంటూరు), అబుల్ ఫౌజాన్ (కరీంనగర్) సహకరించారు.
నాకు ఉపయుక్తమని భావించిన వివిధ గ్రంథాలను, సమాచారాన్ని,డాక్టర్ బద్దేలి ఖాశిం సాహెబ్ (ప్రొద్దటూరు, కడప),డాక్టర్ యన్.రామచంద్ర (పొద్దటూరు), 'సాహిత్యనేత్రం' త్రైమాస పత్రిక సంపాదకులు షేక్ బేపారి రహమతుల్లా (శశిశ్రీ) లు అందించారు. ఆ తరువాత విశ్రాంత తెలుగు అధ్యాపకులు, షేక్ అలీ (కావూరు లింగంగుంట్ల, గుంటూరు జిల్లా) తన ఇంటికి ఆహ్వానించి తన గ్రంథాలయంలోని గ్రంథాలను, ప్రత్యేక సాహిత్య సంచికలను అందచేయడం మాత్రమే కాకుండ చాలా వివరాలు సేకరించి నాకు పంపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉన్న కవులు-రచయితల సమాచారం రాబట్టడంలో ఆయా ప్రాంతాలలోని షేక్ అబ్దుల్ హకీం జాని (తెనాలి), సయ్యద్ ఖుర్షీద్ (మహబూబాబాద్),ఎం.ఎ. సాలార్ (వినుకొండ), ఎండి. ఉస్మాన్ ఖాన్ (ఎన్. జగన్నాధాపురం), ఎస్.పి గఫార్(పోరుమామిళ్ళ) లాంటి మిత్రులు సహకరించారు. నా ప్రకటన వివిధ ఉర్దూ పత్రికల్లోకూడ ప్రచురితం అయ్యేట్టుగా రచయిత అబుల్ ఫ్ధజాన్ (కరీంనగర్) శ్రద్ద తీసుకున్నారు. ఈ విధాంగా నాకు సహాయపడిన పత్రి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
నా వినతి మేరకు అక్షరశిల్పులు గ్రంథానికి 'ముందుమాట' రాసిచ్చిన డాక్టర్ షేక్ మస్తాన్ (అలీఘర్), 'శుభాభినందనలు' తెలిపిన గురుతుల్యులు, ప్రముఖ పాత్రికేయులు డక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు (హైదారాబాద్) లకు, నా ప్రతి పుస్తకాన్ని ఎంతో ఓపికతో చదివి విలువైన సలహాలు-సూచనలు అందచేస్తూ సహకరిస్తున్నమిత్రులు, సద్విమర్శకులు, ప్రముఖ రచయిత, నా ఆప్తమిత్రులు పెద్ది సాంబశివరావు (గుంటూరు), ఈ గ్రంథానికి చక్కని ముఖపత్రాలంకరణ గావించిన ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్ (వినుకొండ),ఈ పుస్తకం గెటప్కు సంబంధించి పలు సూచనలు చేసిన ప్రముఖ చిత్రకారులు అబ్దుల్లా (విజయవాడ), గ్రంథ ప్రచురణకు సాంకేతిక సహాయం అందించిన మిత్రులు ఎన్. జయరాజ్(శ్రీజయదీప్తి గ్రాఫిక్స్, వినుకొండ) గార్లకు నా కృతజ్ఞతలు.
ఈ గ్రంధం రూపుదిద్దుకోడానికి అవసరమైన సమాచారాన్ని పంపించి నా ప్రయత్నం సఫలమయ్యేందుకు సహకరించిన కవులు-రచయితలు-అనువాదకులు, నా ప్రతిప్రయత్నానికి చేదోడు-వాదోడుగా నిలిచే నా భార్య శ్రీమతి షేక్ రమిజా బాను, అక్షరశిల్పులు ప్రచురణ బాధ్యత స్వేకరించిన 'ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్' ఛైర్మన్ హాజీ షేక్ పీర్ అహమ్మద్ (హైదారాబాద్) గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.