అక్షరశిల్పులు
నజీర్ అహమ్మద్ సి.యం: చితూరు జిల్లా కార్వేటినగరంలో
1939 సెప్టెంబర్ 29న జననం. తల్లితండ్రులు: జిలానీ బి, ముహమ్మద్ అక్బర్ సాహెబ్. కలంపేరు: షఫీ. చదువు: యస్.యస్.ఎల్.సి. ఉద్యోగం: విశ్రాంత సహకార సబ్రిజిష్ట్రార్. 1995 నుండి రచనా వ్యాసంగం ఆరంభం. కవితా సంకలనాల్లో, పత్రికల్లో కవితలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. రచన: షఫీ సౌరభ కుసుమాలు (కవితా సంపుటి, 2009). లక్ష్యం: సామాజిక చైతన్యం. చిరునామా: సి.ఎం. నజీర్ అహమ్మద్, ఇంటి నం.15-1742/1, లాలూ గార్డెన్, చిత్తూరు- 517001, చిత్లూరు జిల్లా. దూరవాణి: 94415 76555.
నజీర్ బాషా షేక్: నెల్లూరు జిల్లా నెల్లూరులో 1960 జూన్ 19న జననం.
తల్లితండ్రులు: షేక్ రసూల్ బీ, షేక్ దాదా సాహెబ్. కలంపేరు:
వివేక్. ఉద్యోగం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నెల్లూరు). 2006లో ప్రచురితమైన 'మేథో వాఖ్య' వ్యాసం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభ మైంది. ప్రధానంగా 'ధ్యాన మాలిక ' మాసపత్రికలో (విజయవాడ) 'ఖుర్ఆన్' ను పరిచయం చేస్తూ రాస్తున్నధారావాహిక వ్యాసాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. లక్ష్యం: అందరి ఆరాధ్యదైవం ఒక్కడేనన్న సత్యసందేశాన్ని ప్రచారం చేయడం. చిరునామా: షేక్ నజీర్ బాషా, టినం. 21/450, ఆచారి హౌస్, బాశికాల వారి వీధి, పెద్దబజారు, నెల్లూరు-524001, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 97050 03231, 93471 06719.
నజీరుద్దీన్ ఎండి: నల్గొండ జిల్లా గోపువారి గూడెంలో 1964 సెప్టెంబర్ రెండునజననం. తల్లితండ్రులు: గోరిబీ, మొగల్ ఖాజా సాహెబ్. చదువు:ఎం.ఏ., ఎల్ఎల్.బి. వృత్తి: న్యాయవాది. 1984లో 'మరుభూమి'
కవితతో ఆరంభమై పలు వ్యాసాలు, కవితలు వివిధ పత్రికల్లో, సంకలనాలలో ప్రచురితం. 'జంబు ద్వీపం', 'మహాఆదిగా' కవితలు గుర్తింపు తెచ్చి పెట్టాయి. లక్ష్యం: సమకాలీన సమస్యల మీద అభిప్రాయాలు ప్రజలకు చేరువయ్యేలా సూటిగా,ధాటిగా వెల్లడించడం. చిరునామా: ఎండి. నజీరుద్దీన్, ఇంటి నం. 8-1-3750, ఆర్టీసి కాలనీ, నల్గొండ- 508001, నల్గొండ జిల్లా. సంచారవాణి: 98488 12056, 80191 73505. Email: nazeeruddinbsp@gmail.com.
119