అక్షరశిల్పులు
బి.ఇడి. ఉద్యోగం: విశ్రాంత ఉపాధ్యాయులు. 1969 నుండి
వ్యాసంగం ఆరంభించి కవి సమ్మేళనాలు, కవితా గోష్టులలో పాల్గొన్నారు. వివిధ పత్రికలలో, కవితా సంకలనాల్లో కవితలు చోటుచేసుకున్నాయి. పద్యరచన మీద పట్టు సంపాదించి 2008 లో 'అందని ఆమని' (పద్యకావ్యం) వెలువరించారు. లక్ష్యం: సాహిత్య ప్రియులెన పాఠకులకు సుమధుర కవిత్వం అందించడం. చిరునామా: షేక్ మహబూబ్ బాషా, రవినగర్, బైపాస్ రోడ్డు, కోట-524411, నెల్లూరు జిల్లా.దూరవాణి: 08624-229920.
మహబూబ్ గులాం: కడప జిల్లా పగిదేల గ్రామంలో 1928 ఫిబ్రవరి మూడున
జననం. తల్లితండ్రులు: రసూల్ బీబి, గులాం హుస్సేన్ సాహెబ్.
చదువు: బిఎసీ., ఎంఎస్సీ (ఇంజనీరింగ్) , ఉద్యోగం : అధ్యాపకులు (రిటైర్డ్). ఉర్దూ, తెలుగు భాషల్లో మంచి ప్రవేశం కలిగి ఉర్దూ నుండి తెలుగులోకి ప్రముఖ ఉర్దూ కవుల రచనలను అనువదించారు. రచన: షిక్వ జవాబె షిక్వ అల్లామ ఇక్బాల్ (2003). లక్ష్యం: ఉత్తమ ఉర్దూ సాహిత్యాన్నితెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్నది ప్రధాన లక్ష్యం. చిరునామా: ప్రొఫెసర్ గులాం మహబూబ్, ఇంటి నం. 17-1-179, ఎడ్లవారి వీధి, నెల్లూరు-524 001, నెల్లూరు జిల్లా. దూరవాణి: 0861-2300103, 99593 01405.
మహబూబ్ ఖాన్ పి.: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 1947లో జననం.
తల్లితండ్రులు: షేక్ ఖాశింబీ, పి. ఖాశిం ఖాన్. చదువు: పదవ
తరగతి . వ్యాపకం: ధార్మికసేవ. 1982లో గీటురాయి వారపత్రికలో 'మాట' ధార్మిక వ్యాసం ప్రచురితం. అప్పటి నుండి పలు వ్యాసాలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా గీటురాయి పత్రికలో పలు వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. లక్ష్యం: ధార్మికసేవ-సామాజిక సేవ. చిరునామా: పి మహబూబ్ ఖాన్, ఇంటి నం.1-51/3, శివాలయం వీధి, యర్రగొండపాలెం -523327, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 95028 83508.
మీరాజాన్ షేక్: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జన్మస్థలం. పుట్టిన తేది: 15-06-1922. తల్లితండ్రులు: సైదాబీ, పీర్ సాహెబ్. చదువు: ఎస్.ఎస్.ఎల్.సి, వృత్తి
- వైద్యులు (ఆర్ఎంపి). బహు భాషా పండితులు. స్వాతంత్య్ర సమరయోధులు. కలం పేరు:
105