దివ్యదేశ వైభవ ప్రకాశికా/శ్రీ వైకుంఠము

వికీసోర్స్ నుండి

54. శ్రీ వైకుంఠము 14

శ్లో. శ్రీవైకుంఠపురే పృథోస్తు సరసా శ్రీ తామ్రపర్ణీ తటే
   యుక్తే చంద్ర విమాన మధ్యనిలయో వైకుంఠ నాథ: ప్రభు:|
   ప్రాగాస్య స్థితి రాశ్రిత:ప్రియతమాం వైకుంఠ వల్లీం ముదా
   భాతి శ్రీ పృథురాజ శక్ర నయనా గంతు శ్శఠారి స్తుత:||

వివ: వైకుంఠనాథ పెరుమాళ్(కళ్ళపిరాన్)-వైకుంఠవల్లి-పృథు తీర్థము-తామ్రపర్ణీనది-చంద్ర విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-పృథు చక్రవర్తికి, ఇంద్రునకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ కీర్తించినది.

నమ్మాళ్వార్లు "పణ్డనాళాలే" అను దశకమున(9-2)"పుళిజ్గుడిక్కిడన్దు వరగుణ మజ్గైయిరన్దు వైకున్దత్తుళ్ నిన్ఱు" అను తావున(తిరుప్పుళిజ్గుడిలో శయనించి యుండుట;వరగుణమజ్గై యను క్షేత్రమున కూర్చుని యుండుట;శ్రీవైకుంఠమున నిలచి యుండుటలో చేతనులమగు మనలను పొందుటకై సర్వేశ్వరుడుపడు తొందరను ప్రస్తుతించి సర్వేశ్వరుని "భోగ్యపాకత్వర" యను గుణమును ప్రకాశింపజేసిరి.

సూచన: ఈక్షేత్రమునకు 5 కి.మీ. తూర్పున ఆళ్వారు తిరునగరి, 1.కి.మీ దూరమున వరగుణమజ్గై, తిరుప్పుళిజ్గుడి క్షేత్రములు కలవు.

మార్గము: తిరునెల్వేలి-తిరుచ్చందూరు రైలు మార్గములో శ్రీవైకుంఠం స్టేషన్ నుండి 2 కి.మీ దూరములో సన్నిధి కలదు.

పా. ఎజ్గళ్ కణ్ ముగప్పే యులగర్ గళెల్లా; మిణై యడితొழுదెழு దిఱై--;
    తజ్గళన్బారత్తముదు శొల్వలత్తాల్;తలై త్తలైచ్చిఱన్దు పూశిప్ప;
    తిజ్గళ్‌శేర్ మాడ త్తిరుప్పుళిజ్గుడియాయ్;తిరువైకున్దత్తుళ్ళాయ్ తేవా;
    ఎజ్గళ్ మా--లత్తిదనుళు మొరునాళిరు న్దిడాయ్;వీత్‌త్తిడజ్కొణ్డే.
             నమ్మాళ్వార్-తిరువాయి మొழி 9-2-8


మంచిమాట

       అహంకారము అనునది ఒక సర్పము-మమత దానికి శరీరము.
            రాగద్వేషములు ఆసర్పముయొక్క దంతములు.
           దంతములను తీసివేసినచో ఆసర్పము నశించును.
              అనగా రాగద్వేషములను విడచిపెట్టినచో
              అహంకారము నశించునని తాత్పర్యము.


69

55. తిరువరగుణమంగై 15 (నత్తం)

శ్లో. శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే:|
   నాయక్యా వరగుణమంగై నామ సత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూప:|
   విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచ: ప్రియ:|
   సుజన సేవిత పాద సరోరుహ: విజయతే ధరణౌ విజయాసన:||

వివ: విజయాసన పెరుమాళ్-వరగుణమంగై తాయార్-అగ్నితీర్థం-విజయకోటి విమానం-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-అగ్నిహోత్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడ పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళిజ్గుడి" యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని ప్రకాశింపజేసిరి.

సూచన: తిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.

మార్గము: శ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము.

పా. పుళిజ్గుడిక్కిడన్దు వరగుణమంగై యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
    తెళిన్ద వెన్‌శిన్దై యగజ్కழிయాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
    నళిర్‌న్ద శీరులగమ్‌ మూన్ఱుడన్ వియప్ప; నాజ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
    పళిజ్గునీర్ ముగిలిన్ పవళమ్బోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-4


మంచిమాట

భక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.

భగవంతుడు ప్రపన్నులను సంతోషింప చేయ ప్రయత్నించును.