దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువల్లిక్కేణి

వికీసోర్స్ నుండి

          శిన్దై యుళ్ళై ముళై తైழన్ద తీజ్గరుమ్బినై;
   ప్పోరానై కొమ్బొ శిత్త పోరేత్ తినై;
          పుణర్ మరుద మిఱనడన్ద పొఱ్కున్ఱినై;
   క్కారానై యిడర్ కడిన్ద కఱ్పగత్తై
          క్కణ్డదునాన్ కడన్మల్లై త్తలశయనత్తే.
          తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-5-1

94. తిరువల్లిక్కేణి (చెన్నై) 21

శ్లో. శ్రీ మత్కై రవిణీ సరోవర లసత్ బృందావనాఖ్యాయుతే
   వల్లిక్కేణి పురే స్థిత స్సుర దిశా పక్త్రాంబుజో రాజతే|
   రుక్మిణ్యా త్వవిరుద్ద సాత్య బల ప్రద్యుమ్న సేవ్యో త్రిణా
   సంపూజ్యో భువి పార్దసారధి విభు: పార్దాక్షి యుగ్మా తిధి:||
   
   తత్తైవ రంగనాథఖ్యో వేదవల్ల్యా ఫణీంద్రగ:|
   భృగుణా కన్యకాదానం ప్రాపిత స్సుర దిజ్ముఖ||
   తత్తైవ నరసింహాఖ్య: పశ్చిమాభిముఖానస:
   జాబాల్యత్రి మునీంద్రాభ్యాం సేవితో మోక్షదస్తయో::||

   సీతాలక్ష్మణ శత్రుఘ్న భరతై స్తత్ర రాఘవ:
   దక్షిణాభి ముఖస్తిష్ఠన్ మధుముమ్మవి వీక్షిత:||
   గజేంద్ర వరద స్తత్ర సప్తరోమ మునీక్షిత:|
   ప్రాజ్ముఖో గరుడా రూడ శ్శేషాహ్వయ విమానగ:||

   ఇంద్రాగ్ని సోమ మీనాఖ్య విష్ణు తీర్థాతి సుందరే
   శ్రీ మత్కైరవిణీ తీరే రాజంతే పంచమూర్తయ:||
   మార్కండేయాత్రి సుమతి మరీచి భృగు యోగిన:|
   జాబాలి సర్ప రోమణౌ తేపురత్ర పరం తప:||

   పరకాల మహాయోగి భక్తిసార పరిస్తుత:|
   తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే ||

వివ: బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. కైరవీణీ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఆనన్దవిమానము-అత్రిమహామునికి తిరువారాధనము-అర్జునునకు ప్రత్యక్షము.

అచటనే మన్నాధర్.(ఎన్నెయాళుడై యప్పన్;రంగనాథులు) వేదవల్లిత్తాయార్-తూర్పుముఖము-భుజంగశయనము-భృగుమహర్షిచే కన్యాదానము

                                             113 పొందినారు. తెళ్ళి అழకియసింగర్ (నరసింహస్వామి)-పశ్చిమ ముఖము-కూర్చున్నసేవ-జాబాలికి అత్రిమహర్షికి ప్రత్యక్షము.

చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు దక్షిణముఖము-శశపదుని కుమారుడగు మధుమానునకు ప్రత్యక్షము.

తేవప్పెరుమాళ్ (గజేంద్రవరదన్)-తూర్పుముఖము-గరుడా రూడులు-శేష విమానము-ఇంద్ర అగ్ని సోమ మీన-విష్ణుతీర్థములు. వీనిచే చుట్టబడిన కై రవిణీ సరస్సు. ఆకై రవిణీ తీరమున పార్థసారధి రంగనాథ నరసింహ శ్రీరామచంద్ర గజేంద్రవరదులుగా వేంచేసియున్నారు. మార్కండేయ, అత్రి, సుమతి, మరీచి, భృగు, జాబాలి, సర్పరోములకు ప్రత్యక్షము. పేయాళ్వార్-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. ఈ తిరువల్లిక్కేణిలో స్వామి పంచమూర్తులుగా వేంచేసియున్నారు.

విశే: తమిళములో కలువపువ్వును "అల్లి" అందురు. కలువపూవులు మెండు గాగల పుష్కరిణి యగుటచే "తిరు అల్లిక్కేణి" అని ప్రసిద్ది చెందినది. ఈ క్షేత్రము మైలాపూరునకు సమీపమునందుండుటచే మయిలై తిరువల్లిక్కేణి యనియు తిరునామము గలదు. బృందారణ్యక్షేత్రమనియు పేరు కలదు. తొండమాన్ చక్రవర్తి ప్రార్థనచే తిరుమలై తిరువేంగడముడైయాన్ (శ్రీనివాసుడు) కృష్ణావతారముగా సకుటుంబముగా సేవ సేయించిన ప్రదేశము. కావున స్వామి వేంకటేశ్వరుని తిరునామముతో "వేంకటకృష్ణన్" అను తిరునామమేర్పడినది. ఈ దివ్యదేశమున స్వామి రుక్మిణీదేవితోను, బలరాముడు సాత్యకి (సోదరులు) ప్రద్యుమ్నుడు (కుమారుడు) అనిరుద్దుడు (మనుమడు) వీరితో కలసి సకుటుంబముగా సేవ సాయించును. ఇట్టి సన్నివేశమును మరియొకచోట దర్శింపలేము. అట్లే శ్రీరంగనాథులు(శయనించిన) చక్రవర్తి తిరుమగన్(నిలచున్న) గజేంద్రవరదన్ (పయనించుచున్న) అழగియశింగర్ (కూర్చున్న) విధము సేవింపదగినది. (ఒకే దివ్యదేశమున నిన్ఱ, ఇరున్ద, కిడన్ద, నడన్ద తిరుక్కోలములు).

ఇచటనే ఆసూరి కేశవాచార్యులవారు పుత్రకామేష్ఠి చేసి "భగవద్రామానుజులను" పుత్రులుగా పొందిరి.

మార్గము: మద్రాసులోని తిరువల్లిక్కేణి.

పా. విఱ్పెరు విழవుమ్‌ క-నుమ్‌ మల్లుమ్;వేழముమ్‌ పాగనుమ్‌ వీழ;
   శెత్తవన్ న్ఱన్నై పురమెరిశెయ్‌ద; శివనుఱుతుయర్ కళై తేవై;
   పత్‌తలర్ వీయక్కోల్ కైయిల్ కొణ్డు; పార్తన్ఱన్ తేర్‌మున్ నిన్ఱానై
   శిత్‌తవై పణియాల్ ముడితుఱన్దానై; త్తిరివల్లిక్కేణి క్కణ్డేనే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-3-1

114

94.F. గజేంద్రవరదన్-తిరువల్లిక్కేణి.

Gajendravaradan - Triplicane

95.A. యోగనరసింహర్-అమృతవల్లి-షోలింగర్.

Yoganarasimhar - Amrutavalli - Sholingar

95. తిరుక్కడిగై (చోళసింహపురము) 22

శ్లో. చోళ సింహ పురే యోగ సింహనామా విరాజతే|
   అమృతాహ్వయ తీర్థాడ్యే సింహకోష్ట విమానగ:||
   దేవీమమృత వల్లాఖ్యా మాశ్రిత: ప్రాజ్ముఖాసన:|
   ప్రత్యక్షో మారుతై శార్జ్గ నందకాంశ మునిస్తుత:||

వివ: యోగ నరసింహ స్వామి(అక్కారక్కన్)-అమృతవల్లి త్తాయార్-అమృత తీర్థము-సింహకోష్ట విమానము-తూర్పుముఖము-కూర్చున్నసేవ-ఆంజనేయస్వామికి ప్రత్యక్షము-కలియన్; పేయాళ్వార్ కీర్తించినది.

విశే: చోళ సింహపురమునకు(చోళంగిపురము) 3 కి.మీ. దూరములో కొండపాలెము కలదు. ఇచట పెద్దకొండపై నృసింహస్వామి, అమృతవల్లితాయార్ల సన్నిధి కలదు. ప్రతి శుక్రవారము స్వామికి విశేషముగా తిరుమంజనము జరుగును. చిన్నకొండపై ఆంజనేయస్వామి వేంచేసియున్నారు. ఇచట ఆంజనేయస్వామివారు చతుర్బుజములతో శంఖ చక్రములతో యోగ ముద్రతో వేంచేసి యుండుట విశేషము. ఈక్షేత్రము విశేషప్రార్థనా స్థలము. దీర్ఘవ్యాదులు కలవారు, గ్రహపీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు చేతురు. చోళసింహపురములో భక్తవత్సలన్ (ఉత్సవమూర్తి) వేంచేసియున్నారు. వీరి సన్నిధి వెనుక ఆదికేశవర్ వేంచేసి యున్నారు. ఎఱుంచి అప్పా అవతార స్థలము అగు ఎరుంబి అగ్రహారము ఈ క్షేత్రమునకు సమీపముననే కలదు. మణవాళ మహామునులు ఈ క్షేత్రమునకు వడ శ్రీరంగమనియు ఇచ్చటగల పుష్కరిణికి తిరుక్కావేరి అనియు తిరునామముంచిరి.

మార్గము: తిరుత్తణి/ అరక్కోణంకు 30 కి.మీ.

పా. మిక్కానై మఱై యాయ్ విరిన్ద విళక్కై; ఎన్నుళ్
   పుక్కానై ప్పుగழ்శేర్ పొలిగిన్ఱ పొన్ మలై యై
   తక్కానై క్కడిగై త్తడజ్కున్ఱిన్ మిశై యిరున్ద;
   అక్కారక్కనియై; అడైన్దుయ్‌న్దు పోనేనే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 8-9-4

ఉత్తరదేశ తిరుపతులు

శ్లో. ఇదానీ ముత్తరే దేశే స్థితా దేశా: రమాపతే:|
   పర్ణ్యంతే యతిరాజాంఘ్రి ప్రభావాత్సన్ముదే మయా||

శ్రీభగవత్ రామానుజుల వారి శ్రీపాద ప్రభావముచే ఇకపై ఉత్తరదేశమున గల దివ్యదేశములను వర్ణింతును.

                                            115