దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుప్పుళ్‌కు

వికీసోర్స్ నుండి

88. తిరుప్పుళ్‌కుழி (కాంచీ) 15

శ్లో. జటాయు తీర్థ రుచిరే తిరుప్పుళ్ కుళి పట్టణే
   శ్రీ మరకత వల్లీతి దేవ్యా విజయరాఘవ:|
   ఉపవిష్ట:ప్రాజ్ముఖస్సన్ జయకోటి విమానగ:|
   జటాయు గోచారవపూ రాజతే కలిజిన్నుత:||

వివ: విజయరాఘవ ప్పెరుమాళ్-మరకతవల్లి-జటాయుతీర్థం-తూర్పు ముఖము-విజయకోటి విమానము-కూర్చున్నసేవ-జటాయువునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈస్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికులు షోడశాయుధ స్తోత్రమును అనుగ్రహించిరి. ఈ క్షేత్రమునందే యాదవ ప్రకాశులు శిష్యులకు వేదాంతశాస్త్రమును బోధించిరట. పిన్బழగరాం పెరుమాళ్ జీయర్ అవతరించిన స్థలము. కోవెలకు ఎదుట జటాయు మహారాజుల సన్నిధి గలదు. కుంభమాసం పునర్వసు తీర్థోత్సవము. సంతాన విషయకమైన ప్రార్థనా స్థలము.

మార్గము: మద్రాస్-వేలూర్ బస్ మార్గములో బాలిశెట్టి సత్రం వద్ద దిగిన 1/4 కి.మీ. దూరములో నున్నది. కాంచీపురము నుండి బాలిశెట్టి సత్రానికి బస్ కలదు. వసతులేమియులేవు. కంచినుండి పోయి సేవింపవలెను.

పా. అలెజ్గెழு తడక్కై యాయన్ వాయామ్బల్
          కழிయుమా లెన్నుళ్ల మెన్నుమ్;
   పులగెழு పొరునీర్ ప్పుట్కుழிపాడుమ్‌
          పోదుమో నీర్మలై క్కెన్ఱుమ్‌
   కులజ్గెழுకొల్లి క్కోమళవల్లి
          క్కొడియిడై నెడుమழைక్కణ్ణి
   ఇలజ్గెழிల్ తోళిక్నెన్నినైన్దిరున్దా
          యిడవెందై యెందై పిరానే.
          తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-7-8


మంచిమాట

శత్రువులకు భయపడకుము

వారును శ్రియ:పతియగు శ్రీమన్నారాయణునకు శరీరభూతులే.

107

89. తిరునిన్ఱవూర్ 16

శ్లో. వృద్ధ:క్షీర తరజ్గిణీ తటగతే శ్రీ నిన్ఱవూర్ పట్టణే
   ప్రాప్తే వారుణ పద్మినీ స్థితిలసన్ శ్రీ శ్రీనివాసాలయ:|
   ప్రాగాస్యో భువి భక్తవత్సల విభు ర్మన్మాతృదేవీ పతి:
   యాదోనాథ నిరీక్షితో విజయతే శ్రీ మత్కలిఘ్నస్తుత:||

వివ: భక్తవత్సలన్(పత్తరావిపెరుమాళ్)-నన్నుగన్నతల్లి(ఎన్న పెత్తతాయ్)-వృద్దక్షీరనది-వరుణ పుష్కరిణి-శ్రీనివాస విమానము-తూర్పు ముఖము-నిలచున్నసేవ-వరుణునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్ తిరునీర్మలై క్షేత్రమును సేవించి ఈ తిరునిన్ఱవూర్ క్షేత్రమునకు వేంచేసిరి. కానీ ఇచట భక్తవత్సలస్వామి దివ్యమహిషీ ప్రణయ భోగలాలసుడై ఆళ్వార్లను కన్నెత్తియైన కటాక్షించలేదు. వెంటనే ఆళ్వార్లు స్థలశయన క్షేత్రమునకు వేంచేసి అచట స్వామి విషయమై "పారాయదు" అను దశకమును(తిరుమొழி 2-5) ప్రారంభించిరి. ఇది యంతయు గమనించిన పిరాట్టిమార్లు(తాయార్లు) "ఆళ్వార్లచే స్తుతింపబడు అవకాశము మన క్షేత్రమునకు లేకపోయినే! వారెచట వేంచేసి యున్ననూ ఈ క్షేత్రమునకు తోడ్కొనిరండని" స్వామిని పంపగా స్థల శయనక్షేత్రమునకు వేంచేసి ఆళ్వార్ల ఎదుట నిలచిరి. ఆళ్వార్లును ఆ క్షేత్రము నందుండియే "నిన్ఱవూర్ నిత్తిలత్తై తొత్తార్ శోలై" అని తిరునిన్ఱనూర్ స్వామికి మంగళాశాసనము చేసిరి. మీనం శ్రవణం తీర్థోత్సవము-బ్రహ్మోత్సవము మాడవరోజు ఉదయం గరుడసేవ. ఈసన్నిధికి తిరుమలై పెద్దజీయర్ స్వామి నిర్వాహములో నున్నది.

మార్గము: శెన్నై-అరక్కోణం రైలుమార్గములో ఉన్నది. శెన్నై తిరువళ్లూరు మార్గములో కలదు. రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ. బండిమీద వెళ్లవలెను.

పా. పూణ్డవత్తమ్‌ పిఱర్కడైన్దు తొణ్డుపట్టు
         ప్పాయ్ న్నూలై మెయ్‌న్నూ లెనెన్ఱు మోది
   మాణ్డు; అవత్తమ్‌ పోగాదే వమ్మినెన్దై
         యెన్ వణజ్గప్పడువానై; క్కణజ్గళేత్తుమ్‌
   నీణ్డవత్తై క్కరుముగిలై యెమ్మాన్ఱన్నై
         నిన్ఱవూర్ నిత్తిలత్తై త్తొత్తార్ శోలై
   కాణ్డవత్తై క్కనలెరివాయ్ పెయ్ విత్తానై
         క్కణ్డదునాన్ కడన్మల్లై త్తల శయనత్తే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-5-2

                                         108