తెలుగువారి జానపద కళారూపాలు/రోప్ ట్రిక్, ఇంద్రజాలం

వికీసోర్స్ నుండి

రోప్ ట్రిక్, ఇంద్రజాలం


ఒక మైదానంలో గారడి ప్రదర్శనం జరుగుతూ వుంది. ప్రదర్శనలిస్తున్న సోదరు లిద్దరిలో ఒకరు అందరి ముందూ నిలబడి ఒక పొడుగైన త్రాడును పరీక్షకోసం ప్రేక్షకుల కిచ్చి, తరువాత దానిని గాలిలోకి వైకి విసిరాడు. అంతే మరుక్షణం ఆ త్రాడు ఒక కర్రలాగ ధృడంగా నిలబడి పోయింది. అప్పుడు అతని సోదరుడు, ఆ కర్ర లాంటి త్రాడును ఆధారంగా చేసుకుని పైకి పాకుకుంటూ వెళ్ళి అందరూ చూస్తూ వుండగా అంతర్ధాన మయ్యాడు. ఈ ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులకు అది కలా నిజమా అన్నంత సందేహం కలిగింది. ఇంతలో త్రాడు క్రింద పడింది. మొదటి సోదరుడు, నా తమ్ముడేడీ? నాతమ్ముడేడీ అంటూ గట్టిగా అరవటం మొదలు పెడ్తాడు. రెండు నిముషాల అనంతరం రెండవ సోదరుడు దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు.

ఇది కథ కాదు:

ఇది కాథ కాదనీ, కల్పించిన సంఘటన కానే కాదనీ, బి.వి.పట్టాభిరాం గారు తెలియ చేస్తున్నారు. కృష్ణానదీ ప్రాంతంలో నివశించే విప్రవినోదులు - బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్న కాలంలో ప్రదర్శించిన ఒక అద్భుత కార్యం ఇది. ఆ కాలంలో ఈ ఫీట్ ను వారు మాత్రమే దేశం నలుమూలలా ప్రదర్శించే వారు. ఆ కాలంలో మన దేశానికి విచ్చేసిన విదేశీయు లెందరో ఈ అద్భుతమైన ఇండియన్ రోప్ ట్రిక్ ను ఎంతగానో ప్రశంసించారు. విదేశాలలోని వార్తాపత్రికలు దీనికి బహుళ ప్రచారం ఇచ్చాయి.

పాల్ డేనియల్ ప్రశంస:

భారతీయ ఇంద్ర జాల విద్యలో ఒకప్పుడు ప్రాముఖ్యం వహించిన "రోప్ ట్రిక్" గురించి ఒక వ్వాఖ్యానం చేస్తూ ప్రముఖ లండన్ ఇంద్రజాలికుడు "పాల్ డేనియల్" ఈ ఇండియన్ రోప్ ట్రిక్ ను ఏ భారతీయ ఇంద్ర జాలికుడూ ఇప్పుడు ప్రదర్శించడం లేదనీ ఆ కళ అంతరించిందని, తను వ్రాసిన "మేన్ విత్ అండ్ మ్యాజిక్ " పుస్తకంలో ప్రకటించారు. ఇటీవల కాలంలో ఇండియా వారు తమ అద్భుతమైన ఆ కళను ప్రదర్శించ లేక పోవడానికి కారణం కూడా పాల్ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

భారతీయులు నాగరికత వ్వామోహంలో పడి అడవులను నరికి వేయుటమే నన్న పాల్ వ్వాఖ్యలను పట్టాభిరాం గారు ఉటంకించారు.

ఆరు బయలులో, ఆద్భుత ప్రదర్శన:

ఈ ఇండియన్ రోప్ ట్రిక్ ఒక పెద్ద ఆరుబయలు రంగ స్థలంలో ప్రదర్శిస్తారని, అప్పుడు చెట్లతో నిండియున్న ఆ ప్రదర్శనంలో ఇంద్రజాలికుడు ప్రదర్శనకు ముందు రోజు రాత్రి రెండు చెట్లకు ఒక ధృఢమైన త్రాడును బిగించి ఉంచుతాడని ప్రదర్శన సమయంలో తన చేతిలో వున్న త్రాడును పట్టుకునే విధంగా విసురుతాడు. అప్పుడు ఆ త్రాడు నిలబడి వున్నట్లుగా ఉన్న తరువాత తన తోటి ఇంద్ర జాలికుని దానిపైకి ఎక్కి వెళ్ళమంటాడు. అప్పుడు ఆ రెండవ అతను ఎక్కి వెళ్ళి మాయమై పోతాడు. నిజానికి అతను మాయమై పోవటం జరగదు. చెట్ల గుబురుల్లో నుంచి క్రిందికి దిగి వస్తాడు. ఇదే ఆ ట్రిక్.

శిథిలమై పోయిన కళ:

రాను రాను ఈ ప్రాచీన కళ క్షీణించి పోయింది. ఆదరణ లేక పోవటం వల్ల వంశ పారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిని అభ్యసించడానికి వారి సంతతి ఇస్టపడక పోవటం వలన ఈ కళ దాదాపు అంతరించి పోయింది.

పందొమ్మిదవ శతాబ్దాంతానికి మన దేశంలో "రోప్ ట్రిక్" సేసేవారు లేకుండా పోయారు. కొంతమంది స్వార్థ పరులు తమ వద్ద నున్న

తాయత్తులను, వేళ్ళను, తాళ్ళను అమ్ముకోవటానికి తమకు తెలియని చిన్న చిన్న మేజిక్కులను ప్రదర్శించి ఈ కళను పూర్తిగా రోడ్ స్థాయి ప్రదర్శనంగా చేసేశారు. ఈ అద్భుత ప్రదర్శనను పునరుద్ధరించటం ఎంతైనా అవసరం.