తెలుగువారి జానపద కళారూపాలు/కొలనుపాక, భాగవతులు

వికీసోర్స్ నుండి

కొలనుపాక, భాగవతులు

ఆంధ్ర ప్రాంతంలో వున్న గంటె భాగవతులకూ, తెలంగాణా గంటె భాగవతులకు వ్వత్యాసం వుంది. ఈ గంటె భాగవతులు కరీంనగర్ జిల్లా కొలనుపాకలో వున్నారు. వీరి ప్రదర్శనమూ రాత్రి పూటే జరుగుతుంది. వీరి ప్రదర్శన సాహిత్యం అంతగా తెలియక పోయినా, వీరి ప్రదర్శనం మాత్రం ప్రాముఖ్యంగా ప్రదర్శించటానికి ఈ గంటెలను ఉపయోగిస్తారు.

వీరి ప్రదర్శనంలో వచ్చే ప్రతి పాత్రధారి చేతిలోనూ ఒక గరిటె వుంటుంది. అందులో చమురు పోసి వత్తి వేసి వెలిగిస్తారు. ప్రతి పాత్ర యొక్క హావ భావాలూ, ఆంగిక చలనాలు, ఈ గరిటె వెలుతురు వల్ల ప్రేక్షకులకు విశదంగా వెల్లడౌతాయి. మధ్య మధ్య నటనను సాగిస్తూ గంటెలలోని వచ్చిని ఎదగోస్తూ వుంటారు. ఈ వత్తుల వెలుగురు వల్ల ముఖంలో ప్రతిబింబించే సాత్వికాభినయానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తారు. ప్రాచీనులు ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించేవారు. అంటే ఆ నాటికే ముఖాభినయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి నట్లు మనం తెలుసుకోవచ్చు. ప్రతి వారి చేతిలోను గరిటె వుంటుంది కాబట్టి, ఆ గరిట ప్రాముఖ్యంతోనే నాటకాలను ప్రదర్శిస్తారు. అందుకే వారిని గరిటె భాగవతులనీ, గంటె భాగవతులనీ పేరు వచ్చింది.