తెలుగువారి జానపద కళారూపాలు/కత్తిసాములూ, కఱ్ఱసాములూ!

వికీసోర్స్ నుండి

వరంగల్ జిల్లా జనగాం తాలూకా నెల్లుట్ల గ్రామ వాసి బండి ఈనయ్య, నల్లగొండ జిల్ల రామన్న పేట తాలూకా, ఆత్మ కూరు గ్రామవాసి, చర్ల కొండయ్య, వరంగల్లు జిల్లా జనగాం తాలూకా మాణిక్యాపురం గ్రామస్థుడు, చౌదరి పల్లి చుక్క సత్తయ్య.

వీరిలో చుక్క సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతిలోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడంలోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క

తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యులున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.


కత్తిసాములూ, కఱ్ఱసాములూ!


నా చిన్నతనంలో ఏ గ్రామంలో చూసినా వ్వాయామశాలలకు సంబంధించిన తాలింఖానాలు వుండేవి. ముఖ్యంగా వ్వవసాయ తరుణం అయిపోయిన తరువాత తీరుబడిగా వున్న సమయంలో గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో చేరి కఱ్ఱసాము, కత్తి సాము, గరిడీలను చేసేవారు. వారు ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసం ఈ విద్యను నేర్చుకునే వారు.

ఒకప్పుడు రాజాధి రాజులు తమ దేశ రక్షణకోసమూ, ఆత్మరక్షణ కోసమూ సైనికులకు శిక్షణ ఇచ్చేవారు. పాలకులు కూడ ఈ విద్యలో ఆరి తేరిన వారై యుండేవారు.

మారిని పరిస్థితులు:

రాజులు, సామంత రాజులూ, పోయిన తరువాత ఆంగ్లేయులు భారతదేశాన్ని హస్తగతం చేసుకున్న తరువాత అత్యాధునిక మారణాయుధాలు వచ్చిన తరువాత కత్తిసాము, కర్రసాము ప్రాముఖ్యం తగ్గి పోయిన తరువాత వీటి మీద ప్రజలకు ఆసక్తి తగ్గి పోయిందని డా॥ బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాల సంచికలో వుదహరించారు.

ఆనాడు ఈ విద్యకు అధిక ప్రాముఖ్య మిచ్చేవారు. ఈ విన్యాసాలలో పోటీలు ఏర్పరచేవారు. ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ ప్రదర్శనాలను ప్రదర్శించేవారు.

ఆంగ్లేయుల కాలంలో కూడ సంస్థానాలలోనూ, జమీందారీలలోనూ ఈ విద్యను పోషించేవారు.

విజయనగర సామ్రాజ్యంలోని సంస్థాన సామంత రాజులు కత్తిసాము కర్రసాములను ఔత్సాహిక ప్రదర్శనలుగా నిర్వహించేవారట.

ఎంతో సాహసవంతంగా ప్రాముఖ్య వహించిన ఈ కర్రసాము, కత్తిసాము విద్యలు వినోదాత్మక ప్రదర్శనలుగా విరాజిల్లాయి.

ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేక పోయినప్పటికీ ఈ ప్రదర్శనాలు ఒక ప్రక్రియగా, ఒక కళగా ప్రదర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శనాలు వెనుకటి రోజుల్లో కత్తిసాములో రక్షణ కొరకు కృపాణాలనూ, కవచాలనూ ధరించి సైనికుల్లాగా పోరాటం జరిపేవారు. అయితే ఈనాడు మామూలు వస్త్రధారణతోనే ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా కర్రసాములో ఒక కర్రతోనూ రెండు చేతులతో రెండు కర్రలతోనూ ఒకరి కొకరు పోటీ పడి, ఒకరు కొట్టిన దెబ్బను మరొకరు కాచుకుంటూ ప్రేక్షకులకు భయంకలిగే విధంగా ఉధృతంగా కర్రసాము చేసేవారు. అదే విధంగా కత్తి, డాలును ధరించి కూడ అలాగే పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో ఎత్తుకు పై ఎత్తులు, దెబ్బ కొట్టడం, దెబ్బ కాచుకోవడం ఒకరి కొకరు తలపడి ఉధృతంగా పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో కొందరు డప్పు వాయిద్యంతో పోరాటకారుల్ని ఉద్రేకపర్చేవారు. ప్రేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షాలుగా విడిపోయి ఇరువుర్నీ ఉద్రేకపర్చేవారు.

టాసా వాయిద్యం:

కర్రసాము, కత్తిసాము జరిపేవారు అడుగులనూ, భంగిమలనూ చాల అట్టహాసంగా చూపించేవారు. అడుగులకు అనుగుణంగా "టాసా" అనే వాయిద్యాన్ని వాయించే వారు. మరి కొందరు నగారానూ, నౌబత్ ఖానా వాయిద్యాన్ని, కొమ్ము నాదాలనూ చేసి ఉత్సాహపర్చేవారు. వాయిద్య ధ్వనులను విన్నకొలదీ బరిలో వున్న పోరాట యోధులు రెచ్చిపోయి విద్యను ప్రదర్శించేవారు.

ఈ ప్రదర్శనాన్ని మూడు రకాలుగా ప్రదర్శిస్తారంటారు డా॥ బిట్టు వెంకటేశ్వర్లు గారు. ఒకటి కర్ర సాము, రెండు కత్తి సాము, మూడు ఏటా సాము. కర్ర సాములో బాణాకర్రల్లో ఒంటిబాణా, బోడిబాణా అని రకరకాలుగా వరుసలు త్రిప్పుతారు. ఎదుటి వాడు నెత్తిమీద కొడితే ఆ దెబ్బను తట్టుకోవడం, అలాగే గూడ దెబ్బకొడితే దానిని తట్టుకోవడం ఇలా తట్టుకుంటూనే ఎదుటి వాడిని దెబ్బ తీయటం. ఇలా పోరాడతారు.

విన్యాసాలు:

ఈ కర్ర, కత్తిసాములో అందంగా, సుందరంగా ప్రేక్షకులను ఆనందపర్చే విధంగా రక రకాల విన్యాసం చేస్తారు. బాణాకఱ్ఱకు రెండు ప్రక్కలా కిరసనాయిలు ముంచిన గుడ్డలు చుట్టి వాటిని అగ్గి పుల్లతో ముట్టించి కుడి ఎడమ చేతుల్లో మార్చుకుంటూ తిప్పటం బాణా వరుసలో తిప్పటం.

అలాగే కత్తీ డాలూ ధరించి, రక రకాలుగా త్రిప్పి విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిని క్రింది పడుకోబెట్టి అతని పొట్టమీద సొరకాయను పెట్టి పొట్టకు గాయం కాకుండా దానిని రెండు ముక్కలు చేయడం. అలాగే అరటి కాయను పెట్టి అలాగే చేయడం. ఇలా నరకడంలో ఏంతో చాకచక్యాన్ని చూపిస్తూ, అలాగే అరటి కాయను కంఠం మీదా నాలుక మీదా పెట్టి నరుకుతారు. అలాగే పొట్టపై కొబ్బరికాయ నుంచి బలంగా కొట్టి రెండు ముక్కలు చేస్తారు. అంతే కాక పొట్ట మీద తమల పాకును పెట్టి దానిపై ఒక పలుచని గుడ్డవేసి గుడ్డ తెగకుండా క్రింద నున్న తమలపాకును రెండు ముక్కలుగా చేస్తారు. ఇది ఎంత సున్నితంగా చేస్తారో వివరించడం కష్టం. దేనిని నరకటానికి ఎంత బలం ఉపయోగించాలో అలా కత్తిని ఉప యోగిస్తారు.

ఈ కర్ర, కత్తిసాము విద్యనూ, విన్యాసాలనూ విచిత్రాలను విజయనగరానికి చెందిన కరుమజ్జి సత్యం బృందం అత్యద్భుతంగా ఈ ప్రదర్శానాల నిస్తూ వుంది.