చర్చ:ఋగ్వేదము - మండలము 1 - సూక్తము 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఋగ్వేదం వికీపీడియా నుండి ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు aum symbol వేదములు (శ్రుతులు) ఋగ్వేదం · యజుర్వేదం సామవేదము · అధర్వణవేదము వేదభాగాలు సంహిత · బ్రాహ్మణము అరణ్యకము · ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఐతరేయ · బృహదారణ్యక ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య కఠ · కేన · ముండక మాండూక్య ·ప్రశ్న శ్వేతాశ్వర వేదాంగములు (సూత్రములు) శిక్ష · ఛందస్సు వ్యాకరణము · నిరుక్తము జ్యోతిషము · కల్పము స్మృతులు ఇతిహాసములు మహాభారతము · రామాయణము పురాణములు ధర్మశాస్త్రములు ఆగమములు శైవ · వైఖానసము ·పాంచరాత్రము దర్శనములు సాంఖ్య · యోగ వైశేషిక · న్యాయ పూర్వమీమాంస · ఉత్తరమీమాంస ఇతర గ్రంథాలు భగవద్గీత · భాగవతం విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు శివ సహస్రనామ స్తోత్రము త్రిమూర్తులు · తిరుమల తిరుపతి పండుగలు · పుణ్యక్షేత్రాలు ... · ... ఇంకా చూడండి మూస:హిందూ మతము

వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి....1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యయాన.వీటిలో శాకల తప్ప ఇంకేవీ వాడుకలో లేవు... ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు, వాటిలో అధ్యాయాలు, వాటిలో వర్గాలూ ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ, వాటిలో సూక్తాలుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన...ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని వచనం.

ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ మండలంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది... ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదం.... వర్షాలు పడాలంటే పర్జస్య సూక్తాలు పఠించాలని సూచింప బడింది... జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది... శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత॰" అనే సూక్త పఠనం మానవులను దీర్గాయుష్కులను చేస్తుందని వచనం....

విషయ సూచిక [దాచు] 1 ఋగ్వేదం విజ్ఞానం 2 ఋగ్వేదంలోని విశేషాలు 3 మండల విభాగము 4 అష్టక విభాగం 5 వేదాలపై నిరాదరణ 6 ఇవి కూడా చూడండి 7 మూలాలు 8 బయటి లింకులు ఋగ్వేదం విజ్ఞానం[మార్చు] ఋగ్వేదంలోని ప్రధమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి... ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.


ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిః లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి.గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.

ఋగ్వేదంలోని విశేషాలు[మార్చు] ఋగ్వేదం పది మండలములు గా విభజింపబడింది. ఇందులో 10,622 ఋక్కులు, 1,53,326 పదాలు, 4,32,000 అక్షరాలూ ఉన్నాయి. ఇందులో మొదటి యేడు మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోను, పదవ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వే దేవతలు గాను స్తుతిస్తున్నాయి. ఎనిమిది తొమ్మిదవ మండలాల్లో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమలతను ప్రార్ధిస్తున్నాయి. మొత్తానికి పదవ మండలంలో నూటికి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషులు పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయారణ్యకము,ఐతరేయోపనిషత్తు, కౌషీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి.[1] ==శాఖలు==

ఋగ్వేదమునకు మొత్తము 21 ప్రధాన శాఖలు ఉండేవి. ప్రధాన శాఖలు అయిన 19 కాలగర్భంలో కలసి పోయాయి. ప్రస్తుతము ఇప్పుడు దొరుకుతున్నది కేవలం ఒక శాఖ మాత్రమే.((అదే శాకల శాఖ)) ఇంక ఉప శాఖలు ఏవీ దొరకడము లేదు. కానీ కొన్నింటికి, దాదాపుగా 20 ఉప శాఖల పేర్లు మాత్రము మిగిలాయని, తెలుస్తున్నాయని ఉవాచ. మండల విభాగము[మార్చు] మండలములు సంఖ్య = 10. అష్టక విభాగం[మార్చు] అష్టకములు సంఖ్య 8. అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8. అధ్యాయములు సంఖ్య 64 ఈ సంహిత లో 64 అధ్యాయములు మరియు 8 అష్టకములుగా విభజించ బడ్డాయి. ఋగ్వేదంలో ఋక్కులు సంఖ్య = 10472 + వాలఖిల్య సూక్తాలు లోని ఋక్కులు = 80 కలిపి మొత్తం = 10552 సూక్తములు సంఖ్య = 1017 + వాలఖిల్య సూక్తాలు లోని ఖిల సూక్తములు = 11 కలిపి మొత్తం = 1028. వర్గములు సంఖ్య = 2006 + వాలఖిల్య సూక్తాలు లోని వర్గములు = 18 కలిపి మొత్తం = 2024 ఋగ్వేదంలో అక్షరములు సంఖ్య = 3,94,221 + వాలఖిల్య సూక్తాలు లోని అక్షరములు = 3,044 కలిపి మొత్తం = 3,97,265. వేదాలపై నిరాదరణ[మార్చు] ఒకానొకనాడు, ఆచార్యుడు గురు స్థానములో ఉండి వేద విద్యను బోధించాడు. అలా గురుశిష్య పరంపరగా వేదవిద్య వ్యాప్రి చెంది ప్రపంచ మానావాళికి సభ్యత ను, సంస్కృతి ని నేర్పించింది. అంతర్జాతీయ పుస్తక భాండాగారములో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అని ప్రపంచములోని మేధావులు అందరు ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. విదేశీయులే వేదాలు విశ్వ విజ్ఞాన భాండాగార నిధులని మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు. వేద విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావటానికి కొందరు విదేశీ పరిశోధకులు చేసిన శ్రమ, ప్రయత్నాలు ఎంతైనా ప్రశంసనీయం. కొన్ని సామాజిక ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయకులైన వేదజ్ఞుల సంఖ్య తగ్గి, తద్వారా సరయిన ఆదరణ లభించక వేద విజ్ఞానం కొంతవరకూ జీర్ణావస్థకు చేరుకుంది.