Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రైయత్

వికీసోర్స్ నుండి


రై య త్

19-10-1927

పై పేరుతో నొక ఉర్దూ వార పత్రిక ఆజూరు చివర వారము నుండి ఆంధ్ర యౌవనులును, దేశసేవా తత్పరులును అగుముందుముల నరసింగరావుగారి సంపాదకత్వమున వెలువడనున్నది నిజాం రాష్ట్ర వాసుల యందు విజ్ఞానము వ్యాపింప జేయుటయు, నిజాం ప్రభువుగారి పాలనములో నున్న ప్రజా సమూహమున పరస్పర సానుభూతి కలిగించుటయు ఈ పత్రిక ముఖ్యోద్దేశము. చిరకాలము నుండి ఇట్టి ఉర్దూ పత్రిక నిజాం రాష్ట్రము నుండి వెలువడ వలయునని ఎందరో కోరుచుండిరి. తుదకు పరమేశ్వరుని కృప వలన ఆ సంకల్పము నెరవేరినది ఇట్టి కార్యమునకు యుత్సాహవంతులగు సరసింగరావు గారు పూనుకొనుట ఎంతయు ప్రశంసనీయము ఈ పత్రిక ప్రజలు ప్రభుత్వము మధ్యవర్తిగ నుండి చిరంజీవియై వర్ధిల్లుగాక యని కోరుచున్నాము ఉర్దూ భాష తెలిసిన వారందరును ఈ పత్రికాధిపతిని ప్రోత్సహించెదరని నమ్ముచున్నాము.