Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మా యాఱవ సంవత్సరము

వికీసోర్స్ నుండి


మా యాఱవ సంవత్సరము

9 - 5 - 1931

నేటికి మా గోలకొండ పత్రికకు అయిదు సంవత్సరములు పూర్తియైనవి. నిజాము రాష్ట్రమందు ఆంధ్ర పత్రికలకు అయిదవ సంవత్సరము గండము అని మా మిత్రులు చెప్పెడివారు. ఎట్లయినననేమి మా కా గండము తప్పినది.

మా అయిదవ సంవత్సరములో ప్రపంచమంతటను గొప్ప మార్పులు జరిగెను. బ్రిటిషు హిందుస్థానములో ముఖ్యముగా నెన్నడును జూడనట్టి సంచలనము జరిగెను దేశమంతయు సత్యాగ్రహతత్వముచే నిండిపోయెను వేలకొలది జైలుకు పోయిరి. వేలకొలది దెబ్బలు తినిరి. అనేకులు ప్రాణము లర్పించిరి. తుదకు గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగెను కాని యిట్లు అచ్చట ప్రచండ సంచలనము జరిగినను మా రాష్ట్రము మాత్రమే చిక్కులు లేక సుఖముగా నుండుట విశేషము అయినను బ్రిటిషు హద్దులపై యావరించెడి భావములు గాలిచే నిచ్చటికి కొన్ని గొట్టకొని వచ్చిన వనుట నిస్సందేహము మన రాష్ట్రము నుండి గోల్మేజు సభకు ప్రభుత్వ ప్రతినిధులు వెడలియుండిరి. సభలో మన ప్రభుత్వ నియోజితులు మన రాష్ట్రమును గూడ ఫెడరల్ ప్రభుత్వములో చేర్చుటకు యంగీకరించియున్నారు.

ఈ యంగీకారము చాల ముఖ్యమైనది ఏలన సివిల్ పద్ధతిలో మన రాష్ట్రము చేరినట్లైన......ప్రజా ప్రాతినిధ్య సంస్థ లేర్పడుట తధ్యము

గత సంవత్సరమందు మన రాష్ట్రములో...... మార్పులు విశేషముగా లేవు ..... సం॥లో అయిన ఖాన్గీ పాఠశాలల గష్తీ.......... రెండేండ్ల క్రిందటి 53 వ సభల గష్తీయును యుండిన మార్పులు జరిగినవని చెప్పగలుగు...... కాని ప్రజల మొరలు మన ప్రభుత్వము చెవికింకను బాగుగా నెక్కలేదని మాకు వ్యసనము కలుగుచున్నది ప్రజలే రీతిగా నేడ్చిన నింపుయుండునో, యాయేడ్పు ఎప్పుడు మన ప్రభుత్వ......యమును గరిగించునో యెవ్వరును దారి ...... వారు లేరై రి

గత సంవత్సరమందు ఆంధ్రులు కొంత దేశ... కార్యములు చేసినారు ముఖ్యముగా దేవర... సభ పేర్కొన దగినది. కాని యాంధ్రులలో కార్యదీక్ష చాలా తక్కువ. ఆంధ్రుల యభివృద్ధికి ఆంధ్రులే యాటంక పడువారు కాని యితరులు... ప్రతి గ్రామమందును పటేలు పట్వారీలు, దొరలు, దేశ పాండ్యాలు తమ తమ... జనులసేవ చేసినట్లైన యాంధ్రా... లోనే కాగలదు...

స్థితి యింకను హైక్య మొందుటలో నేమి సందేము. ప్రజలను పీడించి బ్రతుకుట రాక్షసకృత్యము. ప్రజల నోరు కొట్టి తమ కడుపులు నింపుకొనుట పైశాచము. ప్రజలను నిర్ధనులనుగా జేయుటడాకూలపని. ప్రజల నిరక్షరాస్యులనుగా నుంచుట నా స్తికత. ప్రజలే గ్రామమున కలంకారభూతులు. ప్రజలే దేశ సంపదలకు మూలకములు. ప్రజల యభివృద్ధి సర్వతో ముఖాఖి వృద్ధి. వారి నాశనమే సర్వనాశము .

ఈ సూత్రములను ప్రతి' విద్యావంతుడును, ప్రతి ధనికుడును దృష్టి యందుంచుకొని తమ సోదర ప్రజలను వృద్ధికి దేగలుగుదురు గాక !

మన రాష్ట్రములో పత్రికా పఠనాభిలాష యింకను చాల తక్కువ బ్రిటిషు హిందూ స్థానములో ఘోర కల్లోలములు జరుగుచుండినను గాంధీగారి పేరు విననివారు కొందరున్నారు. పేరు వరకు వినినవారు గాంధీగారు జైలు నుండి యెప్పుడు వచ్చెదరు అని ప్రశ్నించువారున్నారు. మన ధనికులకు మొకద్దమాలపై యున్న యభిలాషలో శతాంశముకాదు సహస్రాంశమైన పత్రికలపై నుండిన వారు తరించగలరు

కచ్చేరీ వ్యవహారములపై ఖర్చు పెట్టు దానిలో సహస్రాంశము పత్రికలపై కర్చుపెట్టినవారు వృద్ధికి వత్తురు. తుదకు వారు తమ విదేశీ సిగరేట్లకు దినమునకు నాలుగణాలు వ్యయముచేయుదురు. కాని పత్రికలకై వారమునకు రెండణాలు వ్యయము చేయనొల్లరు. మేము మా పత్రికా స్థాపనా కాలము నుండియు రెండంగములు దృష్టిపధమందుంచుకొని దేశీయుల సేవజేయు చున్నాము మొదటిది యాంధ్ర భాషా సేవ. రెండవది జాతికుల వివక్షత లేక నిష్పక్షపాతముగా నాంధ్రులలో సర్వశాఖలవారి యొక్క సత్వరాభివృద్ధికై పాటుపడుట.

మన రాష్ట్రీయాంధ్రులలో విద్యావంతులమని చెప్పికొనువారిలో విశేషము వంతువారు మాతృభాషాభిమానములేని వారు అనేకులగు దొరలలో (అనగా కేవలము రెడ్లే కాదు వెలమలు, గోలకొండ వ్యాపారులు కూడ నీ దర్జాలో చేరిన వారు) వీరిలో జాతీయత కానరాదు వీరి వేషములబట్టి యెవరును వీరిని హిందువులని చెప్పజాలరు. వీరి భాషయు తెనుగు గాదు విశేషముగా హుర్దూ భాషయందే వ్యవహారములు జరుపుచుందురు అట్టిచో నాంధ్ర పత్రికలనినవారికి తలనొప్పి కలుగుటలో విచిత్రమేమియులేదు. మేము సర్వ శాఖలవారి యభివృద్ధికిగాను బాటుపడు విషయమునకు మా పాఠకులే సాక్షులు.

కాలము మారుచున్నది. నవీన భావములు ప్రబలుచున్నవి. దాని కనుగుణ్యముగా మనమును మన భావములను సవరించుకొనవలెను మన సాంఘికాచారములలో ననేకములీ నవీన కాలమునకు పనికిరావు రాజకీయముగా సహితము మనము చాల వెనుకబడియున్నాము మన రాష్ట్రములో ప్రజలకు రాజకీయాధికారములననేవో తెలియవు. ప్రపంచమందంతటను రాజకీయములు జనులకు ముఖ్య ప్రాణవాయువై యున్నవి ఏ రాజ్య వ్యవహారములు ప్రజల యనుమతిపై నడుపబడునో యా రాజ్యమందే రాజకీయ జ్ఞాన మున్నదని చెప్పవలెను. ఏ రాజ్యమందు రాజకీయమందు ప్రజలకు ........... లేదో యా దేశపు జనులకును చెంచువారికిని చాల భేదము లేదు కావున మేము ప్రజలకును ప్రభుత్వమునకు సూచించున దేమన మన రాష్ట్రములో ప్రజల తెలివి తేటలను వృద్దికి తేవలనని వారికి మునిసిపాలిటీలలో శాసన సభలలో ప్రాతినిధ్య మొసగవలెను

ఆంధ్రులందఱకును మా పత్రికను ప్రోత్సహించుట ధర్మమైయున్నది. ఈ రాష్ట్రమందలి యాంధ్రుల యాదరము తక్కువయగుటచేతనే అయిదు సంవత్సరములు సేవచేయు చుండిన 'నీలగిరి', 'తెనుగు' పత్రికలు గొప్ప నష్టమునకు లోనై యాగిపోయెను అదేవిధముగ "సుజాత" పత్రిక బహు నష్టమునకు పాలై నిలిచిపోయెను ఒకవేళ పత్రికలలో లోపముండినను ఆంధ్రులు వానిని భరింపవలెను తమ బిడ్డ మురికిదని యెవరును పెంటపై పారవేయరు కదాః మన యాంధ్రపత్రిక లిచ్చట ఉర్దూ దినకత్రికలకన్న నెన్నటికిని తక్కువ యైనవి కావని ఘంటాపధముగా చెప్పగలము కాని యదేమి వ్యామోహమో అనేకాంధ్రులు ఉర్దూ పత్రికలను (చదువ లేకున్నను) చేతబట్టిన నది కేవలము హస్తభూషణమే కాక గౌరవప్రదమని కూడ తలతురు మేనత్తకు మీసము లతికించినంత మాత్రముననే పిన్నబ్బ కానేరదు, కావున మా పాఠకులు మాచేయు సేవ మా పత్రికావశ్యకత, ఆంధ్రోద్యమమున కిది మూలకందమని తలచి మమ్మాదరించుటను బ్రశంసించుచు తక్కిన విద్యావంతులను, ధనికులను నీ పత్రికను బహుళముగా నాదరించు నీటుల ప్రోత్సహింతురని కోరుచున్నాము ఈ పత్రిక చిరస్థాయిగానుండి యాంధ్రుల ప్రతిభను దశదిశల ప్రసరింప జేయుటలో నగ్రస్థాన మలంకరించుటకై మా హితచింతకులందఱును చేయూత నొసగుదురు గాక!

మా పత్రికకు వ్యాసములును, వార్తలను పంపి, మాకు తోడ్పడిన విలేఖరు లందఱికిని మేమెంతయు కృతజ్ఞులము ముందుకూడ ఇదేవిధముగ సహాయపడెదరని కోరుచున్నాము.