ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/నంజరాజు

వికీసోర్స్ నుండి


నంజరాజు.

ఈకవి హాలాస్యమాహాత్మ్య మను డెబ్బదిరెండధ్యాయముల వచనకావ్యమును రచియించెను. ఈగ్రంథమున నధ్యాయాద్యంతముల యందు బద్యములు గలవు. కవి వంశవర్ణనమును బద్యములతోనే చేయబడినది. ఈకవి మహిశూరు రాజగు దొడ్డమహీపాలుని పౌత్రుడు; వీరరాజభూపాలుని పుత్రుడు. ఈదొడ్డభూపాలుడు 1670 వ సంవత్సర ప్రాంతములయందుండినవాడు.


కోటి వెంకనార్యుడు.


ఇతడు "ఆంధ్రభాషార్ణవము" అను పేరు గల మంచి యచ్చతెలుగు నిఘంటువును పద్యములుగా జేసెను. దీనితో సమానమైన యచ్చతెనుగు నిఘంటువు మఱి