అన్నమాచార్య చరిత్రము/మరలఁ బాటలు పాడించుట

వికీసోర్స్ నుండి

కవులు విద్వాంసులు గాయకుల్ భూమి-
ధవులు సామంతులు దనుఁ జుట్టి కొలువ-

నంగజగురుమీఁద నభినవంబైన-
శృంగారయుతపదశ్రేణిఁ బాడింప

"చెలులార ! వేంకటశిఖరనాయకుని-
కలికికిఁ గడగంటఁ గనుపట్టునెఱుపు

చెలువ మేగతి నుండెఁ జెప్పరే " యనిన
"నలువునఁ బ్రాణేశు నాఁటిన చూపు

నిలువునఁ బెఱుక నూనిన శోణితంబు
తలపోయఁ గాదుగదా " యన్న పదము

పలుమఱుఁ బాడించి పాడించి చొక్కి
తలయూఁచి "యిది ! కవిత్వం " బని మెచ్చి

యనుపమంబైన ద్రోణాచార్యుమహిమ
గనియుఁ ద్రౌపదితండ్రి గర్వించినటుల-

నన్నమాచార్యు మహత్త్వ మంతయును
గన్నారఁ గనియును గర్వాంధుఁడగుచు

పదరక వేంకటపతిమీఁద నుడువు-
పదముల రీతి నా పై నొక్కపదము

చెప్పుమా యనవుడుఁ జెవు లిరుగేల-
నప్పళింపుచు మూసి హరిహరీ ! యనుచుఁ

బరమపతివ్రతాభావంబుఁ బూని
హరి ముకుందునిఁ గొనియాడు నా జిహ్వ

నినుఁ గొనియాడంగనేర దెంతైన
నను నెట్లు పలికితి నైచ్యంపుఁబలుకు-
 
నాయచ్యుతునిఁ దక్క నన్యుల వినుతి-
సేయుట నా కన్న చెలియలి వావి