అడిదము సూరకవి/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

సూరకవి కాలము.


ఈ కవికాలమును నిద్దారణ చేయు సందర్భమున నితనికి నాశ్రయులును, ప్రభువులును నగు శ్రీవిజయనగరాధీశులను గూర్చియు,వారి సంస్థానమును గూర్చియు నిందుఁ గొంతవఱకు వివరించుట యనుచితము కానేరదు.

శ్రీవిజయనగర ప్రభువులగు శ్రీ పూసపాటి వారు సూర్య వంశజులు. దుర్గాసాక్షాత్కారముఁ బొంది, తనతపః ప్రభావమునఁ దానేలు రాజ్యమున నేడు గడియల కాలము సువర్ణ వృష్టి ,గురిపిం చెనను ప్రసిద్ధిగన్న శ్రీమాధవనర్మ సంతతివారు. కొండపల్లి సర్కారులోని పూసపాడను గ్రామనివాసము చేత వీరికి పూసపాటి వారని యింటి పేరు గలిగినది. ఓరుగంటి సంస్థానము ప్రతాపరుద్రునితో సశించిన వెనుక వత్సవాయివారు, పూసపాటివారు మొదలయిన వారు మహమ్మదీయులకు లోఁబడిరి. రఘునాధరాజను మాఱుపేరు గల *పూసపాటి తమ్మిరా జుగారు గోలకొండలో సరదారుగా నుండి శ్రీకాకుళమునకు వచ్చి,



  • « ఈతమ్మి రాజు గారికి రఘునాధరాజను మాఱు పేరు లేదు. ఈయన యన్న గారి పేరు రఘునాధ రాజు. " శ్రీకృష్ణ విజయము "న నీవిషయము స్ప స్టముగఁ జెప్పబడియున్నది. ఈ తమ్మి రాజు గా రీ కృష్ణ విజయమును రచించిన కవి. వ్యవహారమున నీయసకు మాధవ వర్మయని వాడుక యుండినట్టగ జరిత్రల వలనం దెలియుచున్నది — విశాఖపట్టణ, మండల, చరితమున నిుట్లున్నది.


21 శ్రీకాకుళముకు పొజుదారుగానుండిన షేరుమహమ్మదుఖాను వలన 1652 సంవత్సరమున కూలిమి 1.భోగాపురపు తాలూ కాలను గుత్తకు పుచ్చుకొని పాలనముచేయ నారంభించెను. **ఈయన పుత్రుఁడై న శీ తారామచ ద్రరాజు గారు మఱికొన్ని తాలూకాలను గూడ కవులునకు పుచ్చుకొని పర్లాకిమిడిసంస్థా నాధిపతియైన గజపతి దేవుతో మైతి సంపాదించి 125 గుర్రపు రౌతులతోను 450 కాల్బలముతోను పొట్నూరు జయించి కళింగ రాజని పేరు వడసి యాయూరు నివాసమేర్పరుచు కొని


« పూసపాటివారి వంశములో మాధవవర్మ గారు మొదట అప్పుడుశ్రీకాకుళము సర్కా రులో నొక భాగమున సుండు విశాఖపణ జిల్లాలోనికి వచ్చిరి. 1852 సంవత్సరములో సనగా రారాజగు నవురంగజీ బువారి వలన గోలకొండ వారి వంశము నశింపు చేయఁబడక పూర్వము 35 సంవత్సరముల కిందటనాయన వచ్చుట జరిగినది. అప్పటిలో షేరుమహమ్మదుఖాను శ్రీకాకుళములో ఫవుజు దారుగా నుండెను. ఆయనయొద్ద మాధవవర్మ గారు " మిలే, భ గాపురముల నిజారాచేసిరి. "-7 వ. అధ్యా, పుట 501–(కార్మెయకలు దొర వారియింగ్లీషుగ్రంధమునకు నిజాపురపు కోదండరావు పంతులు గారి తెనుఁగు తర్జుమా.) .

ఇది కుమిలి గాని కూలిమిగాదు. మాగామమగు రేగకు నిది మూఁడు మైళ్ళదూరమున నున్నది. దీని నే కుంభిళా పురమని ఉషాభ్యుదయము మొదలగు గ్రంధములలో వాడి యున్నారు.

1.సీతారామచంద రాజు గారు తమ్మిరాజు గారి ఫుత్రులుగారు. తమ్మి రాజు గారి తమ్ముఁడగు అన్నమరాజు గారి పుత్రులు. ఈ షయము కృష్ణవిజయమునందును,పూసపాటి వేంకటపతి రాజు మహా రాజప్రణీతమగు ఉషాభ్యుద యమునందును స్పష్టమః గవివరింపబడి యున్నది.

ప్రబలుఁడై యుండెను. ఈయన యనంతరమున *నానందరా జుగారు పరిపాలనమునకు వచ్చిరి. ఈయన పుత్రులు విజయ రామరాజుగారు బహుప్రసిద్ధ పురుషులు. ఈయన మన్నె దొర లను గెలిచి వారి దేశము లాక్రమించుకొని మన్నె సుల్తాను బిరుదంది, పొట్నూరు నుండి తన పేరిట విజయనగరమను పేరం బరఁగిన యూరికి. రాజధానిని మార్చుకొని 1712 వ సంవత్సర మునకు సరియైన విజయసంవత్సర విజయదశమి జయవారము నాఁడు కోటకట్టుటకు శంకుస్థాపనము చేసెను.

1758 వ సంవత్సరమున నిజాము, కొండపల్లి, యలూరు, రాజమహేంద్ర వరము, శ్రీకాకుళము సర్కారులను ఫ్రెంచి వారికి చ్చెను. అప్పుడు విజయరామరాజుగారు శ్రీకాకుళము " నకు నాయిబయిన జాఫరల్లీతోఁ జేరి దేశము ఫెంచివారికి ఈ స్వాధీనము కాకుండునట్లు చేయుటకయి ప్రయత్నించెను గాని, వారు రాజమహేంద్రవరము శ్రీకాకుళపు సర్కాలను తక్కున సిస్తుకు కవులునకి చ్చెద మన్నందున జాఫరల్లీని విడిచి 'ఫ్రెంచి వారితోఁ జేరెను. తరువాత సర్కారులోని రాజులందజును పెంచి వారికి .లోఁబడక తిరుగఁబడి నప్పుడు సహితమీయస


  • ఈ ఆనందరాజు. గారిని సీతారామచంద్ర మహారాజులుం గారు శ్రీ పూసపాటి పెదజగన్నాధ రాజు గారి కుటుంబములో నుండి దత్తత చేసికొని నట్లు కనఁబడుచున్నది. ...

వారియెడల విశ్వాసము గలవాఁడయి యుండి 1755 వ సంవత్సరమున ప్రెంచి సేనానాయకుఁడయిన బుస్సీకి కావలసిన ధనమును రహస్యముగాఁ బంపెను. తరువాత బుస్సీ సేనలతో దేశమును స్వాధీనముచేసి కొనుటకు కళింగ దేశమునకు వచ్చినప్పు డీయన బొబ్బిలివారితోడి తసపూర్వ వైరమును సాధించుకొనుటకయి బుస్సీని పురికొల్పి యుద్ధము చేయునట్లు చేసి తానుగూడ సేనలతోఁబోయి 1757 'సం!! జనవరు నెల 24 వ తేదీని తాండ్ర పాపయ్యచే పొడువబడి పరమపదము నొందెను. తరువాత విజయరామరాజు గారి * పితృవ్యపుత్రుడైన యానందగజపతిరాజుగారు సింహాసనమునకు వచ్చి, బుస్సీ విజయ రామరాజుగారి యెడలఁ జూపిన యాదరమును తన యెడలఁ జూపకపోవుల చేత మనసులో ద్వేషము పెట్టుకొని బుస్సీ విశాఖపట్టణము మొదలై సస్థానముల నన్నిటిని స్వాధీనము చేసికొని పై యధికారుల యుత్తరువు ననుసరించి యీ దేశమును విడిచి కర్ణాటకమునకు వెడలి పోఁగానే సేనలను గూర్చుకొనిపోయి విశాపట్టణమును పట్టుకొని దాని నింగ్లీషువారికి వశపఱచెదనని యుత్తరములు వాసి 1757 సం||రమున వారితో స్నేహముచేసికోనెను. తరువాత నతఁడు ఫ్రెంచివారి నుత్తరపు సర్కారుల నుండి తమివేయు ప్రయత్నములలో నింగ్లీషువారితోఁ జేరి, దొరకినకొల్లలోఁదనకు భాగమిచ్చునట్లును, జయించిన దేశములో నదీసముద్రతీర -


* పితృవ్య పౌరులు, "గాని, పుత్రులు గారు.

.

పట్టణములును, వాని చుట్టుపట్లగల దేశమునుదక్క మిగిలిన భా గమును దన పాలనములో నుంచునట్లును యుద్ధవ్యయముల కింద తాను నెల కేఁబదివేలరూపాయల చొప్పున నిచ్చునట్లు ను ఏర్పఱచుకొని, కర్నల్ ఫోర్డుగారిచే నడపఁబకు చుండిన ఇంగ్లీషుసేనతోఁ దన సేనను జేర్చి దండయాత్ర వెడలెను. ఆవఱకే ఫ్రెంచి సేనానాయకుఁడయిన కప్లాన్సుగా రానందగజపతిరాజు గారిని శిక్షించుటకయి దండయాత్ర వెడలి యింగ్లీషు సేన యాయనతో, జేరినదని విని రాజమహేంద్రవరమున నిలిచి పోయెను. కర్నల్ ఫోర్డుగా రానంద రాజుగారు వెంటరాఁగా రాజు మహేందవరమునకు వచ్చి ఫ్రెంచి సేనాధిపతియైన కన్ ఫ్రాన్సు గారి సక్కడనుండి పాఱుఁదోలి, మచిలీ బందరున బోయి ! దానిని స్వాధీనపఱచుకొనెను. దండు వెడలియున్న యింగ్లీషు వారిని జయించుటకయి నిజాముసలాబత్ జంగు మచిలీ బందరు నకు 15 మైళ్ళ దూరము వఱకును వచ్చి వారినిజయించుట సాధ్యముకాదని తెలిసికొని 1759 వ సం||రము మెయి 14 వ తేదీ ని సంధి చేసికొని మచిలీ బందరు సర్కారును కొండవీడు నైజాముపట్టణము సర్కారులును ఇంగ్లీషు వారికిచ్చి వేసి, ఆనందగజప తిరాజు గారు "ప్రెంచి వారి కియ్యంబడిన దేశమునుండి గ్రహించిన సొమ్ము విషయమై తగవు పెట్టక విడిచి పెట్టి వారి తండ్రి తాతల నుండి వారనుభవించు చుండిన దేశమును వారనుభవించుట కంగీకరించెను. ఈయొడంబడిక యయిన తరువాత స్వదేశము


వకు వచ్చుచు త్రోవలో రాజమహేంద్రవరమున నానందగజ పతి రాజుగారు స్ఫోటకముచేత కొలధర్మము నొందిరి. అప్పుడాయన భార్య లిద్దఱును సహగమనముచేసిరఁట. తర్వాత బొబ్బిలిలో మృతులయిన విజయరామరాజు గారి భార్యచంద్రయ్యమ్మ గారు సన్నిహిత జ్ఞాతియైన పూసపాటి రామభద్రరాజుగారి ద్వితీయభార్య పుత్రుడైన పండ్రెండు సంవత్సరముల ప్రాయము గల వేంకటపతిరాజను చిన్న వానిని పెంచుకొని ఆచిన్న వాని పేరు విజయరామరాజుగా మార్చి యాయనను పట్టాభిషిక్తుని జేసెను. ఈ విజయరామరాజు బాలుఁడయి నందున రాజ్యధికార మునంతను సవతియన్న గారగు సీతారామరాజుగారు వహించి, తమ్మునకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత సహితమధికారము నంతను తానే చెల్లించుచువచ్చెను. ఈ విజయరామరాజుగారి కాలములోనే మన కవియుండినది. ఆకాలమునందు విజయన గరమువారు నిజాముకు కట్టుపన్ను రెండులక్షల తొంబది వేల యేఁబదితొమ్మిది రూపాయిలు అయినను దేశ మస్వస్థస్థితిలో నున్నందున నిజాము తనకు రావలసిన కప్పమును తిన్నఁగాఁగైకొన శక్తుఁడు గాక 'పెక్కేండ్లూరకుండుచు వచ్చెను. ఈ హేతువు చేతను, సీతారామరాజుగారు బలవంతులయి తమ సేనలతో చిల్లర సంస్థానాధి పతుల' నదిమి కప్పములు గొనుచుంచుట చేతను విజయనగర రాజ్యమాకాలము నందించు మించుగా స్వతంత్ర రాష్ట్రమువలెనే యుండెను. ఈ సీతారామరాజుగారు బొబ్బిలి

రాజయిన చిన్న రంగారావుగారిని పట్టుకొని విజయనగరములో చెఱసాల యందుంచెను. పర్లాకిమిడి రాజగు నారాయణ దేవు! జగన్నాధయాత్ర పోవుట సందు చేసికొని యతని రాజ్యముమీద దండెత్తి యాత్ర నుండి తిరిగివచ్చిన యాతని నరసన్న పేట వద్ద నోడించి యిప్పటి గంజాము మండలములో విశేషభాగము ను విజయనగర రాజ్యములోఁ జేర్చెను. తన తమ్ముని వెంటఁగొని తండనూత వెడలి సీతారామరాజుగారు మొగలితుఱు వఱకు నువచ్చి స్థానిక పాలకుఁడయిన నబాబు బడ్జి అబ్జమాఖానును జయించి కొంతకాలము 'రాజమహేంద్రవరము సర్కాను సహిత మాక్రమించినట్లు చెప్పుదురు. ఇట్లింకను పెక్కు జయములను బొంది మహోన్నత దశయందుండిన యీకాలములోనే యింగ్లీషువారు నిజామువలనఁ బొందిన సనదుప్రకారముగా నుత్తరపు సర్కారులలోఁ దమ యధికారమును జెల్లించుట కారంభించిరి. ఇంగ్లీషుకంపెనీ వారితోఁ జేసికొన్న యొడంబడికనుబట్టి సం పత్సరమునకు మూఁడులక్షల రూపాయిలు పేష్కష్.. చెల్లించుటకును, పర్లాకిమిడి రాజయిన నారాయణ దేవు వలనఁ గైకొన్న రాజ్యమును విడిచి పెట్టుటకును విజయనగరము వారొప్పుకొనిరి ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత విజయనగరసంస్థానమునకు లోబడియున్న కొండజమీందారు లందఱును విజయనగరము వారి మీద తిరుగఁబడి స్వతంత్రులగుటకుఁ బ్రయత్నించిరి.


కాని సీతారామరాజుగా రన్నిటికిని దగినవాడై నందున నింగ్లీషు సేనలను సహాయ్య పఱుచుకొని యాకొండ సంస్థానాథపతుల నొక్కక్కరినే జయించి కొందఱి దేశములను తమ రాజ్యములోఁ గలుపుకొనియు కొందఱిని విజయనగరమునఁ జెఱసాలలో బెట్టియు నందఱిని సాధించెను. ఈకలహములలో ఆండ్ర పాలకొండజమీన్ దారులు మాత్రము చేర లేదు. సీతారామరాజుగా రిట్లుపరరాజులను జయించుటయే కాక తురకదొరలు మసీదుల కిచ్చిన భూములను పూర్వరాజులు బాహ్మణుల కిచ్చిన మాన్యములను గూడ లాగుకొని ప్రజలను సహితము .క్షోభ పెట్ట నారంభించెను. ఈయన పెట్టుబాధలే సూరకవిని రామలింగేశ శతకము 'చెప్పనట్లు చేసినవి. "


ఇట్లుండఁగా సంస్థానము నందుండిన రాచవాఱందరు నొకటిగాఁ జేరి 1775 న సంవత్సరమునందు మంత్రిత్వమును మాని రాజ కార్య సంబంధము వదలుకొను నట్లు సీతారామరాజు గారిని నిర్బంధపఱచిరి. తన పుత్రుడయిన నరసింహగజపతి రాజును స్వీకారముచేసికొని విజయరామరాజు గారి మరణానంతరమున సింహాసన మాతనికిచ్చునట్లు తమ్ముని నొడఁబఱచి యాయన తాను మంత్రిత్వమును విడుచుట కంగీకరించెను. ” . విజయనగరము వారు చెల్లింపవలసిన కప్పముయొక్క మొత్తమును నిర్ణయించుటకయి కంపెనీ వారి చెన్న పురి

పరిపాలకుఁడు విజయరామరాజు గారిని చెన్నపురి రమ్మనికో రెను, కోరిన ప్రకారముగా విజయరామరాజుగారు చెన్న పురికిఁబోక ప్రయాణ వ్యయములకు తన చేత సొమ్ము లేదనియు, తనయన్న యయిన సీతారామరాజుగారు తన్ను నాశనముచేయుటకయి తంత్రములు పన్ను చుండిన యాకాలములోఁ దాను రాజధానిని విడిచి దూరముగాఁ బోవుట యుచితము కాదనియు, విశామపట్టణములోని యధికారుల సమక్షమునఁ దాను వారు విధించెడు న్యాయమైన కప్పమున కంగీకరించెదననియు చెప్పి తప్పించుకొ నెను. అంతట చెన్నపురి పరిపాలకుఁడు సీతారామరాజుగారిని చెన్నపురికి రమ్మనికోరఁగానే యతఁడు తక్షణమేపోయి యక్కడివారిని వశపఱచుకొని, రాజా కార్యములు చక్కఁబఱుచు కొని విజయనగర సంస్థానమునకు తన్ను దీవానుగా నేర్పాటుచేయించు కొని తసపుత్రుని స్వీకారమును స్థిరపడిపించుకొని, మరల వచ్చెను. ఈ యేర్పాటుల వలన విజయరామరాజు గారు పేరునకు రాజుగా నుండినను నిజమైన యధికారమంతయు సీతారామరాజుగారి చేతిలో నే చిక్కెను. ఈ విషయ మై విజయరామరాజుగారు కంపెనీ వారికి మొఱ పెట్టుకోఁగా పె ట్టుకోఁగా తుదకు వారాయనను దివాను పనినుండి తొలఁగించి విజయనగరము విడుచునట్లుత్తరువు చేసిరి. అందుపయిని సీతా రామరాజుగారు : విజయనగరము విడిచి సింహాచలము నివాస ముగా నేర్పఱచుకొని యక్కడ కొంతకాలముఁడి, తరువాత

మరల తమ్ముని మంచిమాటలాడి 1790 సం|రమునం దొకసారి యు 1792 సం||రమునం దొకసారియు మరల సంస్థానములో దివానుగాఁ బ్రవేశించి కడపటిసారి కంపెనీ వారి చే చెన్నపురికిఁబోవు నట్లుత్తరువు చేయఁబడి నెలకయిదు వేల రూపాయిల యుపకార వేతనము మీఁద 1798 సం||రము నందక్కడకుపోయి చేరెను. సీతారామరాజు గారి దుష్పరిపాలనము మొదలయిన కారణములచేత విజయరామరాజుగారు ఋణముల పాలగుటయే గాక కంపెనీ వారికి కట్టవలసిన కప్పమును సరిగా కట్టలేక యాఱుులక్షల యిరువదియైదు వేల రూపాయిల వఱకును బాకిపడిరి. అందుచేత కంపెనీవారు సంస్థానమును తమపాలనమునకుఁ దీసికొని విజయ రామరాజు గారెం రాజ్య మునుపెడిచి మచిలీ బందరులో వాసము.చేయునట్లు యుత్తఱరువు చేసి ఆయనకు ముప్పది వేలకూపాయ లొక్కసారిగా రొక్క మిచ్చెదమనియు నెలకు 1200 రూపాయిలు వ్యయ ములకిచ్చెద మనియుఁ జెప్పిరి. ఆయన స్వదేశమును విడుచుట కిష్టము లేని వారయ బందరు పురమునకుఁ బోవు మార్గమున బయలుదేఱి యైదాఱుకోసుల దూరము పోయి యక్కడనుండి పరివారముతో వెనుకఁదిరిగి పద్మనాభమునకుఁ బోయి యక్కడ నుండి తాను ప్రయాణము చేయలేక పోవుటకు సాకులు వ్రాయనారంభించెను. విజయరామరాజుగా రక్కడ నున్న కాలము లో రాచవారును నాలుగువేల సైనికులనుబోయి యాయనను

జేరిరి. కంపెనీ వారికీ సంగతి తెలియఁగానే యిరువదినాలుగుగంటల కాలము గడువిచ్చి యాలోపల నతఁడు బందరు మార్గమున బయలు దేఱని పక్షమున బలత్కారముగాఁ బంపవలసినదని విశామపట్టణములో నున్న సేనానాయకున కుత్తరువుచేసిరి. పయివారి యుత్తరువును దెలియఁబఱిచి యింగ్లీషు సేనాధిపతి యయిన ప్రెండర్గాస్టుగారు కొంతసేన (750 భటుల)తో పద్మ నాభమునకుఁబోయిరి. 1794 సంవత్సరము జూలై నెల తే 10 ది యుద్దయమున నింగ్లీషు సేనాధిపతి పద్మనాభపు కొండనుజేరున ప్పటికి, విజయరామరాజు గారును బంధువులయిన రాచవారును ఖడ్గపాణులయి లోఁబడక యుద్ధముచేసి వీర మరణము నొందుటకు నిశ్చయించుకొని యందఱును పద్మ నాభస్వామి ప్రసాదమును స్వీకరించి యుద్డోన్ముఖులయి నిలిచి యుండిరి. నాఁడు సూర్యోదయకాలమున నింగ్లీషు సేన లకును రాజుగారి సేసలకును ముప్పావు గంటసేపు ఘోరయుద్ధము జరిగినది. అంతట రాజు గారి సేనలన్నియు చెల్లాచెదరయి పాఱిపోయినవి. రణరంగము నకుఁబోయి చూడఁగా రణనిహతులై వీరశయనము నొందిన వారి శరీరములక్కడ మున్నూట తొమ్మిది కనఁబడినవి. రణభూమి నలంకరించిన 'మున్నూట తొమ్మిదింటిలో నిన్నూట యెనుబది రాచవారి దేహములు. రణరంగమధ్యమునఁ బడియుండిన విజయరామరాజుగారె శవము చుట్టునుకోట కట్టినట్లుగా సంస్థానము లో నున్నతస్థితిలో నుండిన . యుత్తమ క్షత్రియుల శవములు


నలువది గుండు దెబ్బలతో బడియుండెను. ఇట్లు మరణమునొందిసవారు గాక పాఱిపోయి న వారిలో 'నెందఱికి గాయములుతగిలినవో తెలియలేదు. ఇంగ్లీషు సైనీకులలో మృతినొందిన వారు పదముగ్గురు, గాయపడిన వారఱువది యొక్కరు. ముప్పదియేండ్ల కిందట బొబ్బిలికోట ముందు పెదవిజయరామరాజుగారు హతులైనట్లే, మనకవీంద్రుని కాలములో నుండిన యీచిన విజయరామరాజుగారు పద్మనాభ పుకొండ ముందు నిహతులై రి. మన కవి కాలముతో సంబంధించిన చరిత్రమింతే. తండ్రి మర ణమును విని యప్పటి కెనిమిది సంవత్సరములు ప్రాయము వాఁడై న నారాయణ బాబుగారు తల్లీతోడ గూడ కొండ దేశమునకు పాటిపోయిరి. కాని కంపెనీ వారాయనను బిలిపించి దొరతనమిచ్చిరి. ” (రావుబహదూరు కం!! వీరేశలింగముపంతులుగారు ఆంధ్ర కవుల చరితము. తృతీయ భాగము పుటలు. 69-75.) :

పాఠక మహాశయులారా ! రారాజులచేతను గవిరాజుల చేతను,విలసిల్లి దిగంత విశ్రాంతమగు కీర్తినిగాంచిన శ్రీ పూస పాటి మహా రాజవంశమును గూర్చి వాయవ లెనన్న ఒక ప త్యేక గ్రంథమగును. అంత విపులముగ నిచట వివరింప నవ కాశము లేనివాఁడనై శ్రీవీరేశలింగము - పంతులగారి గ్రంథ మునందు సంగ్రహముగ వాయబడిన చరిత్రమును గైకొని నిచట నుపయోగపఱచు కొంటిని.. .. .. .. . . .


సూరకవి తనగ్రంథముల నన్నిటిని రామచంద్రపుర రామలింగేశ్వరున కంకిత మొనర్చెను. గంథములు' -దేవాంకిత ములైన కారణముచేతఁ గవి కాలనిర్ణయమునకు సౌకర్యము నియ్యఁజాల కున్నవి. అయినను నితఁడు తనప్రభువులగు విజయనగర పురాధీశులపై ఁ జెప్పిన చాటుపద్యముల వలనఁగాల నిర్ణయము చేయుటకు వీలగ పడుచున్నది. పూర్వోదాహృత ములైన మెత్తనైనట్టి యరఁటాకు మూఁదఁగాక " అను గీత పద్యమును ఢిల్లీలోపల గోలుకొండ పురినిండా "అను వృత్త మును, క్రీస్తుశకము 1746 సంవత్సరపాంతమున * బాదుల్లా ఖానునకును మొదటి, “పెదవిజయరామ మహ రాజునకు ను జరిగి న యుద్ధమును గూర్చి సూరకవి చెప్పియున్నాఁడు. దీనిని బట్టి సూరకవి 1738 మొదలు 1757 వఱకు రాజ్య ముచేసిన 'పెదవిజయ రామ మహా రాజుగారి కాలమున నున్నాఁడనుట స్పష్టము.

పెదవిజయ రామరాజుగారి తర్వాత ఆనందగజపతి మహా రాజుగారు. రాజ్యమునకు వచ్చి కొలఁది కాలము మాత్రము


- * "స్న 1158 ఫసలీ 1748 సంవత్సరములో జాఫరల్లీ ఖాసుడికి అయివజుగా బహుదుల్లాఖానుడు శ్రీకాకుళం సర్కారుకు ప్రవేశించినాఁడు. అదివరకు జాఫరల్లీ ఖానుడు 8 సంవత్సరములు హకీంగిరిచేసినాడు. . అటు తరు వాత బహుదుల్లాఖానుడికిన్నీ విజయ రామ రాజు గారికిన్నీ హవేలీ పరగణాల నిమిత్తమున్నూ జమాబందీఖణా యించడం నిమిత్తమున్నూ జవాబు సవాలు నిమిత్తమున్నూ లడాయివచ్చి కలహం చేస్తూ యున్నంతలో' "(......శ్రీవిజ యనగరం సంస్థావం డెయిరీ మెమోరాండము. 1652-1845.) . :


రాజ్యముచేసిరి. ఆయన స్వరస్థు లైన సిదప ఆ చినవిజయరామ మహా రాజు”గారు సింహాసనమునకు వచ్చి 1760-1794, వఱకు ను రాజ్యముచేసిరి. ఈమహా రాజుగారి కాలముననే మన కవి గారి ప్రభంచాల హెచ్చుగ నుండెను. సూరకవి యీచిన విజ యరామమహా రాజు గారి కాలమున నున్నాఁడనుటకు నిదర్శనములు పెక్కులుగలవు. ఒకటి రెండింటిని మాత్రమిచటఁ జూపు చున్నాఁడను. . శ్రీ వత్సవాయి తిమ్మ జగపతి మహా రాజుగారి రాజ్య కాలమున 'పెద్దాపురము 'లో నొకప్పుడు రాజులందఱు(తమ బంధువర్గములోని, వారును మిత్రమండలిలోని నారును నగు మహారాజులు) సభ చేసి కూర్చుండి యుండఁగా సూరకవి తన ప్రభువును స్తుతించుచు.

<poem> ఉ. రాజుకళంకమూర్తి రతి రాజు శరీరవిహీనుఁడంబికా రాజు దిగంబరుండు మృగ రాజు గుహాంతర సీమవతింవి భ్రాజితపూసపా డ్విజయ • రామసృపాలుఁడు రాజు గాక యీ రాజులు రాజు లే పెనుత రాజులు గాక ధరాతలంబునన్ ,

అను నీపద్యమును సభాసదులైన రాజులవంక ఁ జూచుచుసభిన యముతోఁ జదువనందలి కడపటివాక్యము తమ్ము నుద్దేశించి కవి చెప్పెనని యభిప్రాయపడి మహీపాలురంద ఱొక్కుమ్మడిఁ గోపమును జూప నతఁడించు కేనియు జంకక పద్యార్థమునుదేట

తెల్లముగ విప్పి చెప్పి వారిసందజను శాంతచిత్తులుగఁ జేసెనని ప్రబలమగు నొక వాడుకకలదు. శ్రీవత్సవాయి. తిమ్మజగపతి మహారాజులుంగారి రాజ్య కాలము క్రీ| వె|| 1759 మొదలు 1797 వఱకుఁగల కాలమైనందున నీయనకు సమకాలికుఁడు చినవిజయరామ మహారాజనుట స్పష్టము. ఆ కారణము చేత సూరకవి చినవిజయరామ మహా రాజుగారి కాలమున నున్న నాడని చెప్పుట కేమియు నా క్షేపణము లేదు. ..

ఇంతియ 'కాక చినవిజయ రామమహా రాజునకు సమకా లికుఁడై * శృంగవరపుకోట జమీని బరిపాలించు చుండిన శ్రీముఖీ కాశీపతి రాజుగారి రెండవ కుమారుఁడు రాజభూపాల రాజు. తన సత్త్వమును, నెదిరి సత్త్వమును దెలియనివాఁడై మి గులఁ బ్రబలులై యున్న విజయనగర పురాధీశులమీఁదికి దాడి


(1) * " ......... అంతట కాశీపతి రాజు గారి శృంగవరపుకోట మీదికి దండుయెత్తి, మోహింది గే వర్కువారు లొంగుపోటులో రానందున సకల ప్రయత్నాలు చేసి కోట మాత్రం పట్టుకొని రాజ్యం స్వాధీనం తెచ్చుకున్నారు. గన్కు వారు 'కాశీపురం ప్రవేశించి పితూరీ చేస్తూ వచ్చినారు. యీ కాశీపతి రాజు గార్కి ముగ్గురు కొమాళ్ళు. వారి పేర్లు. వీరభద్రరాజు, వీరముకుంద రాజు, రాజభూపాల రాజు, యీ ముగ్గిరి కొమాళ్ళతోటివుండగా యింతలో కాశీపతి రాజు వుండగా నే పెద్దకుమారుడైన వీరభధ్ర రాజు నష్టపోయినాడు. * అంతట .కాశీపతి రాజ్కు బలంతగ్గి శీతారామరాజు గారితోటి బహు దినములు లడాయి చేసి ఆయనయున్నూ గతించినాడు. తరువాత వీరముకుంద రాజూన్నూ వెడలి రాఁగనట్టి సాహసకృత్యమును బరిహసించుచు సూరకవి యిట్లోక పద్యమును జెప్పి యున్నాడు.

 గీ. విజయ రామ మహారాజు వీరుఁడేలు
పట్టములికించె రాజభూపాల రాజు
కడమ మాటల కేమి యీ కాలమునను
బుఱెవచ్చెనును బులితో గొఱైగఱచె.

ఈనిదర్శనము కూడ సూరకవి చినవిజయరామ మహా రాజుగారి కాలమున నున్ననాఁడనియే నిర్ధారణ చేయుచున్నది.

వీర్కి జేరు దస్తులో ర్కౌబహు యుద్ధం చేస్తూ యుండగా చఖ సమయమందు శీతా రామరాజు గారికి దయవచ్చి వీరి దేశంవదలి నాడు జమాబందీ విస్తరించి కట్టినంద్ను, తాలూకాలో వారికి మానువర్తి మాత్రంగడిచేది. హాని గాని ఘజానా గాని చేసేటందు - ద్రవ్యం మిగి లేదికాదు. " (ఫుటలు 15, 16.)

పూసపాటి వారి కైఫీదు..

ఆంధ్ర సారస్వత ప్రచురములు10.

వి!! ఆర్

జగపతివర్మ గారిచే సంపాదితము

(2) " ......... Like other petty chiefs, the Mukkis were evicted by Vizianagram, but in the general collfusion consequent on the sequestration of that Zamindari in 1793 (P. 50), one of the old family, Mukki Rajabhupalaraju, took forcible possession of Kasipuram." (Vizagapatam Gazetteer, Vol. 1. Ch.XY Srungavarapukota Taluk, Page 317).


మీఁదఁ జెప్పియున్న ప్రకారము.సూరకవి కీ| శ||1720వ సంవత్సర ప్రాంతమున జననమొంది యిరువదియైదు సంవత్సర ముల పాయమువఱకు 'రేగలోనుండి పిదప 'చీపురుపల్లె కుఁ గాఁ పురము మార్చె యామరణాంతర మచ్చటనే యుండెను. 1794వ సంవత్సరమునఁ బద్మనాభ యుద్ధములో వీరస్వర్గమును గాంచిన తన ప్రభువగు రెండవ విజయరామ గజపతి మహారాజులుంగారి కంటెఁ దొమ్మిదిపది సంవత్సరములు ముందుగ ననఁగా 1785 సంవత్సర ప్రాంతమున నీకవి వరుఁడు కీర్తిశేషుఁడయ్యెను. .