అచ్చతెలుఁగురామాయణము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీమత్కూచిమంచి తిమ్మకవి విరచించిన

అచ్చతెలుఁగురామాయణము

ఇది

ప్రిసీడెన్సీ కాలేజిలో

నాంధ్రమునకుఁ బ్రథమపండితుఁడగు

శ్రీ రేకము రామానుజసూరిచే

లేఖకప్రమాదాదిజనితదోషంబులు లేకుండఁ

బరిష్కృతమయి,

పత్తి రామానుజులునాయనివారిచే

శ్రీనికేతనమను స్వకీయముద్రాక్షరశాలయందు

ముద్రింపింపఁబడియె.

Madras

1869

Registered Copyright

ప్రకటన

శ్రీమదాంధ్రకవీంద్రులకు నన్నయభట్టారకులు తిక్కన సోమయాజి యేరాశాప్రగడ నాచన సోమనాథుఁడు శ్రీనాథుఁడు మున్నగు ప్రాచీనులు - రాయసదస్యకవులగు పింగళి సూరనార్యులు అల్లసాని పెద్దనార్యులు ముక్కు తిమ్మచార్యులు లోనుగాగల యాధునికులును విరచించిన గ్రంథములు తత్సమభూయిష్టములు గాని కేవలాంధ్రములు గావు. తద్భవములు మెండుగాఁ గలిగి కేవలాంధ్రకృతులు తఱుచుగాఁ గానంబడుట యరిది. కేవలాంధ్రకృతి గావించుట దుష్కరమయినను మృదుపాశశయ్యాదులతో నీ (రామాయణ) మచ్చతెలుఁగుననే కూచిమంచి తిమ్మకవి రచియించెను. ఇది పలుతావులఁ బెక్కుపాఠభేదములు గలిగి చదువువారలకు సుభోధముగాక మెండుస్ఖాలిత్యములు గలిగియుండుటం జేసి చక్కగా సంస్కరింపించి ముద్రింపించినయెడల నన్నిచోటుల వ్యాపించి పాఠ మేకరూపముయి యభ్యసించువారలకు సుబోధమయి యుండునని యెంచి సత్తి రామానుజులు నాయఁడుగారు ముద్రింపించందలంచియుండ - దొరతనమువారు ప్రకృతమందు బి. ఏ. అనుపరీక్షకు నీగ్రంథము సయిత మేర్పఱిచినట్లు ప్రకటించినది తెలియనయినందున స్వప్రయత్నమున కిది మిగుల ననుకూలమని యెంచి శోధింపించి ముద్రింపించిరి. దీనియం దక్కడక్కడఁ దఱుచు కఠినవదములు మొదలగు వానిని విశదము చేయుకొఱకు నొకలఘుటీకయ విరచించి ప్రకటింపబడును.

ఈగ్రంథము చెన్నపురి పెద్దినాయనిపేట టంకసాలవీథినిఁ దలుపులెక్క 81 గల శ్రీనికేతనముద్రాక్షరశాలయందు పత్తి రామానుజులు నాయనివారిచే విక్రయింపఁబడుచున్నది.