వాడుకరి:Babavali virat

వికీసోర్స్ నుండి

నాపేరు : బాబావలి నేను ఆంధ్ర లొయోల కళాశాలలో బి.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను page 6

రాశారు
[దళిత సాహిత్య విమర్శ]:: కూడా1985 తర్వాత ఊపందుకుంది. దళితకవిత్వ ఎ జెండ పేరుతో జి . లక్ష్మినరసయ్య రాసిన ముందు మాటతో తెలుగు దళిత సాహిత్య విమర్శ ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి దళిత కవిత్వంలో ధ్వని సూత్రాలను అన్వయిస్తూ దళిత సాహిత్య విమర్శకు దేశియ భూమికను అందించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాలమ్లో దళిత సాహిత్య విమర్శ ఊపందుకుంది.
   [దళిత కధ]
             దళిత జీవితాఅలను స్పృశిస్తూ చిత్రిస్తూ సంస్కరణ, అభ్యుదయ, విప్లవ సాహిత్యాలలో భాగంగానే ప్రారంభమయ్యాయి. శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన పుల్లం రాజు కధలో 1925 లో తొలిసారి దళిత ప్రస్తావన కనిపిస్తుంది. కొలకూరి ఇనాక్ రాసిన ఊరబావి[1968] కధ తొలి దళిత కధగా విమర్శకులు పేర్కొంటున్నారు. ఎండ్లూరి సుధాకర్, కాలువ మల్లయ్య, జూపక సుభద్ర, చల్లపల్లి సుధారాణి మొదలైన వారి కధలో దళిత జీవన వాస్తవికత కనిపిస్తుంది. దళితుల్లోని అంతఃసంఘర్షణను, మాల మాదిగల మధ్య ఆర్దిక, సాంస్కృతిక వ్యత్యాసాలను వర్ణిస్తూ రాసిన కధలు కనిపిస్తిన్నాయి. వస్తు విస్తృతితో పాటు శిల్పంలోను మార్పులు చేస్తూ దళిత కథలు విస్తృతంగా వెలవడినాయి.
   [దళిత నాటకాలు]
                    అన్న మొదట్లో దళితుల జీవితం పట్ల సానుభూతిని చూపుతూవచ్చినవే. మునిమాణిక్యం నరసింహరావు "తిరుగుబాటు"(1938) ఉన్నవ లక్ష్మినారయణ "హరిజన నాటకమ్"(1938) వంటి కొన్ని నాటకాలు దళితుల పట్ల సానుభూతి కనిపిస్తుంది. అయితే 1959 లో బోయి భీమన్న రాసిన "రాగవాశిష్టం" నాటకాన్ని తొలి దళిత నాటాకంగా భావించవచ్చు. పురాణ ప్రసిద్ధమయిన అరుంధతీ వశిష్టుల ప్రణయ గాధను ఆధారంగా చేసుకుని ఈనాటకం బోయిభీమన్న రాశారు . కుల సమస్య దళిత సంస్కృతి పరమైన విషయాలను చర్చించాలనే లక్ష్యం ఈనాటక0లోబ్ కనిపిస్తుంది . "భారతీయులంతా ఒక్కటే అనే జాతీయతా భావాన్ని స్థాపించాలనేది రచయిత ప్రయత్నంగా కనిపిస్తుంది నిష్కల్మషమైన జీచ్వితానికి మానవుల మధ్య వర్ణభేదం అవసరంలేదని, కొందరు స్వార్ధపరులు త ఆధిక్యం కోసం వాటిని సృష్టించారని , వాటిని విస్మరించి ఆర్య- అనార్య సిద్ధాంతచర్చ కూడా ఇందులోన్ కనిపిస్తుంది.
                 జన్మనా జాయతేశూద్రః
                 కర్మణా జాయతే ద్విజః
                 వేద పాఠంతు విప్రాణాం
                 బ్రహ్మజ్నానే బ్రాహ్మణ అనే వేదోక్తిని ఆధారంగా చేసుకొని అధను కులస్తురాలు అనార్య అయితే అరుంధతీ ఆర్యురాలయింది బోయి భీమన అభిప్రాయపడుతారు.
దళిత కధ

ఊర బావి కధ మాల-మాదిగల మంచినీళ్ళ సమస్యను వర్ణించిన కధ. అగ్ర వర్ణాల దౌర్జన్యాన్ని ఓక మాదిగ స్త్రీ ఎలా ఎదుర్కుందో చెప్పిన కధ. అగ్ర వర్ణాల వారి పీడనను అగ్రవర్ణాలవారి నీతితోనే సమధానం చెఊఇన కధ ఇది. వ్యవస్ధ కోసం వ్యక్తి చేసిన సాహసం ఇందులో కనిపిస్తుంది. కాలువ మల్లయ్య రాసిన అగ్ని గుండం (1991) కధలో మాదిగలు డప్పు కొడుతూ సమజానికి సహకరిస్తున్నా, ఆ మాదిగలకు



శ్రీశ్రీ బి.ఏ పూర్తికాగానే విశాఖకు తిరిగివచ్చాడు . టైఫాయిడ్ తో 63 రోజులు మంచం పట్టాడు. దీనితో శ్రీశ్రీ శరీరమ్లోనే కాక ఆలోచనల్లో మార్పువచ్చింది. భావకవిత్వం పై భ్రమలు తొలిగిపోయాయి. అప్పటిదాకా వున్న ఆస్తి పోయి సొంత ఇల్లు కూడా లేని దారిద్ర్యం పిడించింది. దీనితో ఏన్నో ఉద్యోగాలు చేశాడు ఈ దుస్థితి 1930 నుండి1950 దాకా కొన సాగింది.
భావకవిత్వంపై అసంతృప్తితో కొత్తదనం కోసం "సుప్తాస్థికులు"గీతాన్ని 1929లో రచించాడు. నూతన తత్వాన్ని గుర్తించని భారతి పత్రుఇకా దీన్ని ప్రచురించకుండా తిప్పి పంపింది.కల్పనా ప్రపంచం నుండి కవిత్వాన్ని వాస్తవలోకానికి మరలించి సఫలీకృతుడైనాడు. "మరోప్రపంచం , మరోప్రపంచం " అంటూ తెలుగు సాహిత్య ప్రపంచాన్ని మలుపు తిప్పి అభ్యుదయ మార్గం వైపు బాటలు వేయించాడు. ఇది జ్వాల పత్రికలో 1954లో ప్రచురించారు.

మాహప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం తెలియదు నేను సాహిత్యం ద్వారానే మర్క్సిజాన్ని నేర్చుకున్నాను అని తెలియజేశాడు. తెలుగు కవిత్వంలో మార్పులు రావాలనుకున్నాడు "నాలుగు చక్రాల బండ్లు నాలుగు పాదాల పద్యాలు అక్కర్లేదు అనుసున్నాడు> అవి ప్యూడల్ యుగానికి ప్రతీకలు. కవిత్వాన్ని ఏప్పుడు కన్నతల్లి లా భావించాడు శ్రీశ్రీ.." ఓహొ ! ఓర సధుని ! మణిఖని ! జననీ ! ఓ కవితా అనేది ఆయన కవిత్వ ధృక్పధం ఆధునిక కవి పఠాభి రచించిన ఫిడేలు రాగాలు డజనుకు శ్రీశ్రీ ఇంట్రో రాశాడు. అది సంచలనం సృష్టించింది. కవితా ! ఓ కవితా అనే గీతాన్ని శ్రీశ్రీ చదవగా విశ్వనాధవారు విని ఆనందంతఒ దాన్ని ఆయన అచ్చు వేయిస్తానన్నారు . చలంగారు శ్రీశ్రీ పై అభిమానంతో మాహప్రస్తానం కావ్యానికి పిఠికను రచించారు. తర్వాత మరో దశాబ్దానికి గాని అది ప్రచురితం కాలేదు . 1946 రాజమండ్రిలో జరిగిన 3 వ మహాసభలో శ్రీశ్రీ ప్రారంభోపన్యాసం చేశాడు. హింది నుండి డబ్బింగ్ అయిన ఆహుతి అనే సినిమాకు శ్రీశ్రీ మొదటి రచన చేశాడు . 1954లో శ్రీశ్రీమొదటి విదేశీ ప్రయాణం చేశాడు. అయితే స్టాక్ హొంలో జద్రిగిన శాంతి సభల్లో భారత ప్రతినిధిగా పాల్గోన్నాడు. 1955 నాటికి సొంతయిల్లు సొంతకారుతో స్థిరపడ్డాడు. శ్రీశ్రీ రెడియో నాటికలు , కథానికల్లో సిద్దహస్తుడు. మరోప్రపంచం , చరమరాత్రి, రచనల్లో చైతన్య స్రవంతిని ప్రవేశ పెట్టాడు. తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతిని ప్రవేశపెట్టిన ఘనత శ్రీశ్రీదే. శ్రీశ్రీ కొంతకాలం సిని పరిశ్రమలో పనిచేశాడు అయితే తనకు సినిమా రంగం లో కార్యదర్శిగా ఉన్న సరోజను పెళ్ళి చేసుకున్నాడు{1958}లో . శ్రీమతి సరోజ వల్ల శ్రీశ్రీ కి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కలిగారు. శ్రీశ్రీ రచించిన "ఖడ్గసృష్టి" కావ్యసంపుటికి సొవియట్ లాండ్ నెహ్రు అవార్డ్ వచ్చింది . ఈ అవార్డ్ కొసం శ్రీశ్రీ మరోమారు రష్యా వెళ్ళాడు {1967}లో రష్యాలో టాల్ స్టాయ్ భవనాన్ని చూశాడు . అగ్రరాజ్యంగా ఎదిగిన రష్యా అభివృద్ధిని గుర్తించాడు. దిగంబర కవుల తిరుగుబాటును శ్రీశ్రీ సమర్ధించి వళ్ళా కవితల్లో కొన్ని ఆంగ్లంలోకి అనువాదిచాడు. 1970/2/2 వ తేదిన విశాఖ పట్టణంలో శ్రీశ్రీ షష్ఠిపూర్తి ఘనంగా జరిగింది. దాదాపు 2000 మంది ఊరేగింపులో పాల్గోన్నారు . 1970 జూలై 4 వ తేదిన సెవెన్ స్టార్ సిడికేట్ శ్రీశ్రీ ని ఘనంగా సత్కారించాలని నిర్ణయించింది. ఈ సభకు కొందరు మంత్రులు , సినిమా వారిని ఆహ్వానించారు. అయితే కొందరు మేధావులు శ్రీశ్రీ ని అ సన్మానానికి వెళ్ళవద్దని చెప్పగా శ్రీశ్రీ ఆ సభకు వెళ్ళి తన అభిప్రాయాలు నిస్సంకొచంగా తెలియజేస్తానని , సన్మానాన్ని స్వికరించనని తేలియజేశాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత శ్రీశ్రీ సెవెన్ స్టార్ వారి సభకు వెళ్ళకుండా అప్పటికప్పుడు ఏర్పటయిన విప్లవ రచయితల సంఘానికి అద్యక్షత వహించి "మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలపన చేయిస్తా"నని శ్రీశ్రీ విప్లవశంఖం పూరించాడు. "మార్క్స్, లెనిన్ , మావోలు తన ఋషి త్రయంగా తిక్కన ,వేమన , గురజాడ తన కవి త్రయంగా పేర్కొన్నాడు.

సాహిత్య అకాడమి పురస్కారం స్వీకరినిచినదుకు "విరసమ్" శ్రీశ్రీ వైఖరిని ఖండించింది. అయితే శ్రీశ్రీ వచన కవిత్వానికి ఎనలేని గౌరవం తెచ్చాడు. "కవితకు కాదు ఏది అనర్హం అని తేట తెల్లం చేశిన కవి శ్రీశ్రీ.