అక్షరపరబ్రహ్మ యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (అక్షరపరబ్రహ్మ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం[మార్చు]
అర్జునుడిలా ఆడిగాడు: - పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది?ఆధ్యాత్మం ఏది?కర్మ అంటే ఏమిటి?అధి భూతమని దేనిని అంటారు?ఆది దైవతమని దేనిని అంటారు.
అధియజ్ఞః కథం[మార్చు]
మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నాడు?నిగ్రహ వంతులచేత మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.
అక్షరం బ్రహ్మ పరమం[మార్చు]
శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: - పరమైనదీ బ్రహ్మము. ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అంటారు.
అధిభూతం క్షరో భావః[మార్చు]
నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం ఆది భూతం. జీవుడు ఆధి దైవతం. జీవుళ్ళలో ఆధి యజ్ఞుణ్ణి నేనే.
అన్తకాలే చ మామేవ[మార్చు]
అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళుతున్నారో, అతడు నాతత్వాన్నే పొందుతాడు. ఇందులో సందేహంలేదు.
యం యం వాపి స్మరన్భావం[మార్చు]
కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.
తస్మాత్సర్వేషు కాలేషు[మార్చు]
అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన చిన నీవు నన్నే పొందుతావు. ఈ విషయంలో సందేహం లేదు.
అభ్యాసయోగయుక్తేన[మార్చు]
అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైఅన పరమ పురుషుణ్ణి చేరుకుంటావు.
కవిం పురాణమనుశాసితార[మార్చు]
సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ, సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,
ప్రయాణకాలే మనసాచలేన[మార్చు]
అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.
యదక్షరం వేదవిదో వదన్తి[మార్చు]
వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.
సర్వద్వారాణి సంయమ్య మనో[మార్చు]
ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ[మార్చు]
బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని చేరుకుంటాడు.
అనన్యచేతాః సతతం[మార్చు]
అర్జునా మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను సులభుణ్ణి.
మాముపేత్య పునర్జన్మ[మార్చు]
పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.
ఆబ్రహ్మభువనాల్లోకాః[మార్చు]
అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే (పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.
సహస్రయుగపర్యన్తమహర్యద్బ్రహ్మణో[మార్చు]
వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి తెలిసిన వారు.
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః[మార్చు]
బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమన బ్రహ్మము లోనే అంతా లీనమై పోతుంది.
భూతగ్రామః స ఏవాయం[మార్చు]
అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.
పరస్తస్మాత్తు భావోऽన్యోऽవ్యక్తోऽవ్యక్తాత్సనాతనః[మార్చు]
ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.
అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః[మార్చు]
ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన ఆ పరమాత్మ భావమేచేరవలసిన ఉత్తమ మార్గమని ౠషులు చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే, ఆ సర్వోత్తమ స్థానమే నేను.
పురుషః స పరః పార్థ భక్త్యా[మార్చు]
అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే లభిస్తాడు.
యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం[మార్చు]
భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.
అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా[మార్చు]
అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలుఅనే మార్గంలో బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.
ధూమో రాత్రిస్తథా కృష్ణః[మార్చు]
పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.
శుక్లకృష్ణే గతీ హ్యేతే[మార్చు]
జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని భావించబడుతున్నాయి. మొదటి దానివలన పునర్జమ కలగదు. రెండవ దాని వలన కలుగుతుంది.
నైతే సృతీ పార్థ జానన్యోగీ[మార్చు]
పార్ధా ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి కా.
వేదేషు యజ్ఞేషు[మార్చు]
వేదాలు, యజ్ఞాలు, తపస్సులుదానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |